టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి కొన్ని మిలియన్ల వ్యూస్, లైక్స్ దక్కించుకుని సినిమాపై బన్నీ ఫ్యాన్స్ లో, ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెంచేయడం జరిగింది. మరొక రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో, సినిమా యూనిట్ ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టింది. 

 

అందులో భాగంగా రెండు రోజుల క్రితం ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాల్గొన్న అల్లు అర్జున్, తమ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు కెరీర్ పరంగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, అంతేకాక మరొక్కసారి తనతో ప్రస్తుతం అలవైకుంఠపురములో రూపంలో మూడవ హిట్ కూడా ఇవ్వబోతున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బన్నీ. ఆయనతో పనిచేస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుందని, ఏ హీరో అయినా ఆయనతో పని చేస్తే మళ్ళి, మళ్ళి ఆయనతోనే చేయాలని అనిపిస్తుందని అన్నారు. 

 

ఇక ప్రస్తుతం తమ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు కూడా రిలీజ్ కాబోతుండడంతో తన ఫ్యాన్స్, అలానే మహేష్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా జరుగుతున్న వార్ విషయాన్ని యాంకర్ ప్రస్తావించగా, దానిపై అల్లు అర్జున్ స్పందిస్తూ, తాను ఇటువంటివి పూర్తిగా వ్యతిరేకిస్తానని, అంతేకాక ఆ విధంగా మరొక హీరో పై వల్గర్ గా కామెంట్స్ చేసే కొందరు తన ఫ్యాన్స్ ను తాను ఎంకరేజ్ చేయనని అన్నారు. ఇది పూర్తిగా అనారోగ్యమైన పద్ధతి అని, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే, అందరు హీరోలం సమానమేనని, తప్పకుండా సరిలేరు నీకెవ్వరు మూవీ కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నట్లు బన్నీ తెలిపారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: