మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా యంగ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా సినిమా ప్రతిరోజు పండగే. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా తమిళ నటుడు సత్యరాజ్ ఒక కీలకపాత్రలో నటించడం జరిగింది. ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మంచి టాక్ సంపాదించి అద్భుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మనల్ని కన్నతల్లితండ్రులు తమ ప్రేమను మనకు పంచి, 

 

తమ జీవితాలను సైతం త్యాగం చేసి మనకు గొప్ప జీవితం అందిస్తే, మనలోని కొందరు మాత్రం విదేశాలకు వెళ్లి సెటిలై, కన్నవారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే తమ తల్లితండ్రుల మరణాన్ని సైతం ఏదో ఒక సాధారణ కార్యంగా తీసుకుని ఘోరంగా వ్యవహరిస్తుండడంతో, దర్శకుడు మారుతీ ఇదే పాయింట్ ని తన సినిమా కథగా ఎంచుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తీసి అందరి మెప్పు పొందాడు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే రూ.34 కోట్ల మేర షేర్ ని అందుకుని సినిమా దర్శకనిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ తీసుకువచ్చింది. 

 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓవర్ ఆల్ గా రూ.17 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంటే మొత్తంగా చూసుకుంటే డబుల్ ప్రాఫిట్స్ తీసుకువచ్చిన ఈ సినిమా దర్శకుడు మారుతీకి, నిర్మాతల్లో ఒకరైన యువి క్రియేషన్స్ వారు ఒక ఖరీదైన బెంజ్ కారు ఇటీవల బహుమతిగా ఇవ్వడం జరిగింది. కొన్నాళ్లుగా సైరన్ సక్సెస్ లేని తేజ్ కు ఇటీవల వచ్చిన చిత్రలహరి మంచి బ్రేక్ ని ఇవ్వగా, ఈ ప్రతిరోజు పండగే సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించి మరింతగా పేరు, మార్కెట్ పెంచేసిందనే చెప్పాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: