మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది. ఈ నైట్ నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. మరి కాసేపట్లో అక్కడ షోలు పడే అవకాశం ఉన్నది. ఇక్కడ తెల్లారే సరికి సినిమా భవితవ్యం తేలిపోతుంది. సినిమా పరంగా చూసుకుంటే బాగుండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
అయితే, కొంతమంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఇచ్చేస్తున్నారు. ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. ఇది సినిమాకు బూస్ట్ ఇచ్చినా, సాహో సినిమా మాదిరిగా ఏదైనా తేడా వస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ప్రేక్షకులు సైలెంట్ గా ఉంటున్నారు. అభిమానులు సైతం సినిమా విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు. దీనికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.
మహేష్ సినిమా దాదాపుగా ఏపీలో 2000 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నది. ఈ స్థాయిలో రిలీజ్ కావడం అంటే మాములు విషయం కాదు. మొదటి రోజు సినిమా వీలైనంతగా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే జనవరి 12 వ తేదీన బన్ని అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె, సరిలేరు నీకెవ్వరూ సినిమా విషయంలో అన్ని అనుకున్నట్టుగా కుదిరినట్టుగా వార్తలు వస్తున్నాయి.
పక్కా ఎంటర్టైన్మెంట్ గా సినిమా దూసుకుపోవడం ఖాయం అని అంటున్నారు. దీంతో పాటుగా మహేష్ బాబు నటన సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. సినిమాకు సంబంధించిన అన్ని వేరియేషన్స్ ను మహేష్ బాబు చూపించబోతున్నారు. ఆర్మీ మేజర్ గా బోర్డర్ లో వీరోచిత పోరాటం, ఓ విషయంలో భాగంగా కర్నూలులో రాజకీయ నాయకులను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం అన్ని కూడా సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే.