సంక్రాంతి కి సినిమాల సందడి మామూలుగా లేదన్న విషయం  తెలిసిందే.. మహేష్ బాబు , రష్మీక మందన్న హీరో హీరోయిన్లు గా  కలిసి నటిస్తున్న చిత్రం 'సరిలేరూ నీకెవ్వరూ'..   డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం  సమకూర్చాడు .. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల ప్రపంచ వ్యాప్తంా  కాబోతుంది.. కాగా ఈ చిత్రం హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.. 

 

 

 ఇకపోతే సినిమాలో మహేష్ రొమాన్స్ కు ఎప్పుడు మార్కులు పడేవి కానీ ఈ సారి మాత్రం ఈ సినిమా రొమాన్స్ అంటే పడదు అన్నట్లు మహేష్ నటించాడు.. ఆ దాని వల్లే సినిమా మిశ్రమ టాక్ అందుకుంటుంది..భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రజలను పెద్దగా అకట్టు కున్నట్లు కనిపించలేదు.. మరి సినిమా కలెక్షన్స్ విషయంలో  బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని టాక్ వినపడుతుంది..

 

సినిమా తర్వాత ఏ దర్శకుడితో మహేష్ సినిమా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్ రెండు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు అని వార్తలు వినపడ్డ విషయం తెలిసిందే. ఆ త‌ర‌వాత వంశీపైడిప‌ల్లి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఈ విష‌యంపై మ‌హేష్ క్లారిటీ ఇచ్చాడు. “వంశీ పైడిప‌ల్లి సినిమానే ముందుగా మొద‌ల‌వుతుంది. ఈసారి మేం క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌బోతున్నాం. సందేశాత్మ‌క క‌థ‌ల‌కు కొంత బ్రేక్ ఇస్తున్నామ‌”న్నాడు. 

 

మరో చిత్రంలో కూడా నటించబోతున్నాడు..కేజీఎఫ్ ఫేమ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో ఇటీవ‌ల మ‌హేష్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా వ‌స్తుంద‌ని అనుకున్నారు. వీటిపై కూడా మ‌హేష్ స్ప‌ష్ట‌త ఇచ్చాడు. “ప్ర‌శాంత్ నీల్‌ని క‌లుసుకున్న మాట నిజ‌మే. ఆయ‌న‌కొన్ని లైన్లు కూడా చెప్పారు. కానీ అవి వ‌ర్క‌వుట్ అవుతాయే లేదో ఇప్పుడే చెప్ప‌లేను”అని మహేష్ అన్నాడు. త‌న‌కు అనిల్ రావిపూడితో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌నివుంద‌ని, త‌న ఎన‌ర్జీ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని  ఈ  సందర్భంగా చెప్పుకొచ్చాడు మ‌హేష్‌. త‌న అంచ‌నాల మేరకు ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ మంచి ఫ‌లితాన్ని అందుకుంటే మాత్రం క‌చ్చితంగా ఈ కాంబోలో మ‌రో సినిమా ఉండొచ్చు అని ప్రిన్స్ అన్నారు.. దీంతో సినిమా హిట్ పై మహేష్ కే ఒక క్లారిటీ లేదని అర్థమవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: