ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు సూపర్ హిట్లు అందుకున్న మహేష్ బాబు, ప్రస్తుతం నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తుండగా ఆయన ప్రక్కన చలో, గీత గోవిందం సినిమాల భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఒకప్పటి నటి విజయశాంతి కొన్నేళ్ల విరామం తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటింగ్ చేస్తుండగా, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో భారీగా దీనిని నిర్మించాయి. ఇకపోతే ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్, 

 

టీజర్, ట్రైలర్ లకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుండి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా సూపర్ స్టార్ మహేష్ సూపర్బ్ ఎంట్రీ, ఒక ఫైట్ తో పాటు సాంగ్ రావడం, అనంతరం ఆర్మీ సీన్స్ సమయంలో రాజేంద్ర ప్రసాద్ కామెడీ, ఆపై విజయశాంతి సీన్స్, దాని తరువాత హీరో కర్నూలు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కడం, అక్కడి అదిరిపోయే ట్రైన్ ఎపిసోడ్ సూపర్బ్ గా ఉన్నాయట. ట్రైన్లో తొలిచూపులోనే రష్మిక మ‌హేశ్‌ను చూసి ప్రేమ‌లో ప‌డిపోతుంది. రష్మిక త‌ల్లి సంగీత‌తో పాటు ఆమె ఫ్యామిలీ అంతా మహేష్ ను త‌మ అల్లుడిగా ఫిక్స్ అవుతారు. ఆ వెంట‌నే నైట్ జ‌ర్నీలో వీడు నాకు ప‌డే టైప్ కాదు వీడిని ఏదోలా ప‌డ‌గొడ‌తాను అంటూ డైలాగ్ వేస్తుంది రష్మిక. ఆ వెంట‌నే మియావ్ మియావ్ పిల్లి, మిల్క్ బాయ్ తో పెళ్లి డైలాగ్ చెపుతుంది. 

 

మహేష్ ప‌క్క‌న ఉండే ఆర్మీ పర్సన్ అయిన రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌హాయంతో మహేష్ పడుకుని ఉన్న సమయంలో లైన్ వేస్తుంది. ఈ సీన్‌కు థియేట‌ర్లో విపరీతమైన నవ్వులతో పాటు విజిల్స్ ఆగ‌డం లేదట. ఆ ఫన్నీ ట్రైన్ ఎపిసోడ్ తరువాత హీరో కర్నూలుకి చేరి, అక్కడ విజయశాంతిని కలవడం, ఆపై అదిరిపోయే ఇంటర్వెల్ బ్లాక్ వస్తుందట. అనంతరం మొదలైన సెకండ్ హాఫ్, అక్కడక్కడా కొన్ని యాక్షన్, ఎమోషన్స్ సీన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కలబోతగా సాగుతుందట. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ సినిమాలో ఎంతో బాగున్నాయని, మొత్తంగా ఈ సినిమా చాలా బాగుందని అంటున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: