సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు మొత్తానికి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, కొంత గ్యాప్ తరువాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి, ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా పునః ప్రవేశం చేస్తోంది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నేడు బెనెఫిట్ షో నుండి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఆర్మీ మేజర్ గా మహేష్ ఎంట్రీ తరువాత వచ్చే యాక్షన్ సీన్, ఒక సాంగ్, ఆపై విజయశాంతి ఎంట్రీ, అనంతరం హీరో కర్నూలు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కే ఎపిసోడ్ సినిమాకు పెద్ద హైలైట్ గా చెప్తున్నారు. అనిల్ రావిపూడి ప్ర‌తి సినిమాకు కామెడీ బాగా జ‌న‌రేట్ చేస్తాడు అనే మంచి పేరుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సిన‌మాల క‌న్నా భిన్నంగా ఈ సారి ఏకంగా సూప‌ర్‌స్టార్ మ‌హేస్‌ను డైరెక్ట్ చేయ‌డంతో కామెడీ ఎలా జ‌న‌రేట్ చేస్తాడు అని కొందరు ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే వాటన్నిటినీ ప‌టాపంచ‌లు చేసిప‌డేశాడు అనిల్. ఎఫ్ 2 సినిమాలో అంతేగా అంతేగా డైలాగు ఎలా పేలిందో ఈ సినిమాలో హీరోయిన్ రష్మికతో అర్థ‌మ‌వుతుందా మీకు అన్న డైలాగు ప‌దే ప‌దే చెప్పించి ప్రేక్ష‌కుల చేత క‌నెక్ట్ చేయించాడు. 

 

ఇక హీరోయిన్ త‌ల్లి సంగీత అబ్బ‌బ్బ‌బ్బా అనే డైలాగ్‌ను ఫాలో అవుతూ ఉంటుంది. ఏదేమైనా కామెడీ మాత్రం ట‌పాసుల్లా పేలింది. ఇక ఆ తరువాత కర్నూలు చేరిన హీరో, అక్కడ కొన్ని పరిణామాల తరువాత వచ్చే భారీ యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఆపై వచ్చే సెకండ్ హాఫ్ ని కూడా అనిల్ బాగా హ్యాండిల్ చేసినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్ సీన్స్ తో పాటు అవసరం అయిన చోట సెకండ్ హాఫ్ లో కూడా మంచి కామెడీ సీన్స్ ని జోడించిన అనిల్ రావిపూడి, ఈ సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడంలో పూర్తిగా సఫలం అయ్యాడని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: