టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లో తొలిసారిగా మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. మహేష్ సరసన అందాల నటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి

 

చాలా ఏళ్ల తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తోంది. ఇక హీరో మహేష్ బాబు ఎంట్రీ తరువాత మంచి పవర్ఫుల్ గా ప్రారంభం అయ్యే ఈ సినిమా, మంచి ఆర్మీ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీన్స్ అనంతరం, హిలేరియస్ కామెడీ తో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ తో మరింత జోష్ తో ముందుకు సాగుతుందట. అనంతరం హీరో కర్నూలు చేరడం, అక్కడ విజయశాంతిని కలిసిన తరువాత వచ్చే సీన్స్ చాలా బాగున్నాయ. అలానే విజ‌య‌శాంతి రోల్ అద్భుతంగా ఉందట. ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా ఆమెలో ఎనర్జీ ఏ మాత్రం త‌గ్గ‌లేదని, ప్రోఫెస‌ర్ భార‌తి పాత్ర‌లో అద్భుతంగా న‌టించిందని అంటున్నారు. అటు సీరియ‌స్‌గాను, ఇటు భావోద్వేగంగాను ఆమె న‌టించిందట. ఆమె న‌ట‌న‌లో ఎన‌ర్జీ లెవెల్స్ సూపర్ అని అంటున్నారు. ఈ పాత్ర‌ను అనిల్ రావిపూడి ఆమె కోస‌మే రాశాడా అన్న‌ట్టుగా ఉందట. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో మ‌హేష్ ఆమెను కాపాడే సీన్‌ అయితే అదిరిపోయిందని, ఆ ఒక్క సీన్ కు థియేటర్స్ లో మహేష్ ఫ్యాన్స్ అరుపులే అరుపులట. 

 

ఆతరువాత ప్రారంభం అయ్యే సెకండ్ హాఫ్ కూడా బాగా ఆకట్టుకుందని, ఆ తరువాత వచ్చే కొన్ని యాక్షన్, ఫైట్ సీన్స్ అయితే మరింత బాగున్నాయని అంటున్నారు. ఇక మధ్యలో వచ్చే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ లు చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అని, అన్ని వర్గాలకు సినిమా తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్ తో ముందుకు సాగుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: