సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించి ఆయనకు హ్యాట్రిక్ ని ఇచ్చి తీరుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, అలానే థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచడం జరిగింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కోరిక తీరే రోజు రానే వచ్చింది. నేడు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇప్పటివరకు వస్తున్న స్పందనను బట్టి చూస్తుంటే, మహేష్ బాబు తన కేరీర్ లో అతి పెద్ద హ్యాట్రిక్ విజయాలు అందుకున్నట్లు చెప్తున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఇక ఆర్మీ మేజర్ గా సూపర్ స్టార్ మహేష్ పవర్ఫుల్ ఎంట్రీ తరువాత వచ్చే యాక్షన్ సీన్, దానితరువాత వచ్చే సాంగ్ తో సినిమా మంచి జోష్ తో సాగుతుందట.
అనంతరం వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సీన్ అయితే ఓవర్ ఆల్ గా సినిమా మొత్తానికి అతి పెద్ద హైలైట్ అని అంటున్నారు. దాదాపుగా ముప్పై నిమిషాలకు పైగా సాగె ఆ సీన్ అనంతరం హీరో కర్నూలు చేరడం, ఆపై అక్కడ విజయశాంతి ఎంట్రీ, అనంతరం కొన్ని ఫ్యామిలీ సీన్స్, ఆపై వచ్చే అద్భుతమైన ఇంటర్వెల్ బ్లాక్ తో సినిమా ఎంతో అదరగొడుతుందట. అనంతరం వచ్చే సెకండ్ హాఫ్ లో విలన్ అయిన మంత్రి ప్రకాష్ రాజ్కు వార్నింగ్ ఇచ్చే సీన్ కూడా కామెడీగా స్టార్ట్ చేశాడట దర్శకుడు. సినిమా అంతా కామెడీ కోణంలోనే నడిపించేందుకు ప్రయత్నించాడని అంటున్నారు. ప్రకాష్ రాజ్కు వార్నింగ్ ఇచ్చే సీన్లో మహేష్ కు రెండు ఆప్సన్లు ఇస్తున్నాను ఇంటికి వచ్చినందుకు భోజనం పెట్టి పంపనా, చంపనా అని అడుగగానే, మహేష్ ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవడం బాగుందట. అయితే మహేష్ రాగి సంకటి నాటుకోడి పులుసుతో భోజనం పెట్టమంటాడట.
తరువాత ప్రేక్షకులకి మరోసారి హైకిక్ ఇచ్చే సీన్, విజయశాంతి తో పాటు మహేష్ బాబు విలన్ ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్ అని, అది కూడా ఎంతో బాగుందని అంటున్నారు. అలాగే ఇక్కడ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా బాగా షూట్ చేశారట. అనంతరం ఆ తరువాత మధ్యలో వచ్చే కొద్దిపాటి ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో పాటు మధ్యలో వచ్చే యాక్షన్, ఎమోషన్ సీన్స్ కూడా బాగా పండినట్లు తెలుస్తోంది. ఇక ప్రీ క్లైమాక్స్, అలానే కొంత ఎమోషనల్ గా సాగె క్లైమాక్స్ కూడా బాగున్నాయని, మొత్తంగా ఈ ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా సంక్రాంతి హిట్ బొమ్మగా నిలుస్తుందని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు....!!