సూపర్ స్టార్ మహేష్ బాబు, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఓవర్సీస్లో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఆంధ్రాలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక ఆటలు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ద్వారా 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ప్రొపెసర్ భారతి అనే పవర్ ఫుల్ పాత్రలో ఆమె కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక కథ విషయంలోకి వెళ్తే.. హీరో మహేష్ బాబు ఎంట్రీ తరువాత మంచి పవర్ఫుల్ గా ప్రారంభం అయ్యే ఈ సినిమా, మంచి ఆర్మీ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీన్స్ అనంతరం, హిలేరియస్ కామెడీ తో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీంతంగా నవ్విస్తుంది. దర్శకుడు అనిల్ ఆర్మీ మేజర్గా అజయ్ ఎంట్రీతో సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు ఒక్కటే కామెడీతో లాగేశాడు. అసలు స్టోరీ రివీల్ చేయలేదు.. ట్రైన్ ఎపిసోడ్తో సినిమాను చాలా వరకు నడిపించేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ట్రైన్ ఎపిసోడ్ దాదాపు 30 నిమిసాల వరకు ఉంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్తో మళ్లీ ఊపు తెచ్చి సెకండాఫ్పై హైప్ క్రియేట్ చేశాడు.
ఇక ఫస్టాఫ్ హైలెట్స్ చూస్తే.. మహేష్ బాబు మ్యానరిజమ్స్ అండ్ కామెడీ టైమింగ్, ఇంట్రడక్షన్ మిలిటరీ ఎపిసోడ్స్, బాగానే పేలిన కొన్ని ట్రైన్ ఎపిసోడ్ బిట్స్, ఇంటర్వల్ బ్లాక్ సినిమాలో ఫస్టాఫ్కు హైలెట్స్ అయ్యాయి. కాగా, ఈ సినిమాకు ముందు నుంచి చేసిన ప్రయోషన్స్ బాగా ప్లస్ అయ్యాయి. మహేష్ బాబు గతంలో మీడియాకు ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త దూరంగా ఉండేవాడు. కానీ ఇటీవల తాను కూడా స్వయంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడంతో ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు కూడా మంచి ప్రయోషన్స్ చేయడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.