టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మహేష్ సరసన గీత గోవిందం బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సంగీత వెన్నెలకిషోర్, సత్యదేవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక మొదటగా ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ తో పాటు అక్కడ వచ్చే యాక్షన్ సీన్ అందరినీ ఆకట్టుకుంటుందట. అనంతరం వచ్చే సాంగ్, ఆపై వచ్చే ట్రైన్ ఎపిసోడ్స్ వంటివి ఎంతో బాగున్నాయట. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే మరింతగా అదిరిందని అంటున్నారు.
ఇక సెకండ్ హాఫ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గానే ప్రారంభం అవుతుందని, అయితే మధ్యలో ప్రకాష్ రాజ్ కు హీరో మహేష్ బాబు వార్నింగ్ ఇచ్చే సీన్స్ వంటివి బాగున్నప్పటికీ, అటువంటి సీన్స్ లో కూడా దర్శకుడు అనిల్ కామెడీ పెట్టడం అంతగా ఆకట్టుకోదని కొందరు అంటున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి బలమైన కథ రాసుకోలేదని, సూపర్స్టార్ ఛాన్స్ ఇచ్చాడు కదా అని అరకొర కథతో ఈ సినిమాను పట్టాలెక్కించేశాడని కొందరు అంటున్నారు. అసలు కథకు దశ, దిశ లేదని సినిమా సెకండాఫ్ 20 నిమిషాలు గడిచినా కానీ, అసలు కథేంటో ప్రేక్షకుడికి అర్థం కాదని, ఓవర్ ఆల్ గా వీక్ కథ రాసుకున్న దర్శకుడు అనిల్, కామోడీతో నెట్టుకొచ్చేసాడని అంటున్నారు. విలన్ తో పాటు హీరో, హీరోయిన్, విలన్ ఇలా అందరితోనూ కామోడీతో నడిపించేశాడట.
ఇక మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు సాంగ్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. అయితే ప్రీ క్లైమాక్స్ కూడా బాగానే ఉందని, క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా సాగుతుందని అంటున్నారు. ఓవర్ ఆల్ గా ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకు కావలిసిన హంగులన్నీ కూడా ఉన్నప్పటికీ, మెయిన్ కథను మాత్రం అనిల్ అంత ఆసక్తికరంగా రాసుకోలేదని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఎటువంటి టాక్ తో, ఎంత మేర కలెక్షన్ తో ముందుకు సాగుతుందో చూడాలి..... !!