మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కొద్ది గంటల ముందు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు. యువ కథానాయిక రష్మిక మందన ఇందులో హీరోయిన్ గా నటిస్తే చాలా కాలం తర్వాత 'విశ్వ నట భారతి' విజయశాంతి ఈ చిత్రం ద్వారా సినిమాల్లోకి పునరాగమనం చేశారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ రిపోర్టులను అందుకుంటోంది.

 

అయితే  ప్రతి ఒక ఎమోషన్ కు తగినంత ఇంపార్టెన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి అలాగే తెలుగు సినిమాల్లో చాలా ముఖ్యమైన లవ్ యాంగిల్ కూడా బాగా ప్రెజెంట్ చేశాడు అనే చెప్పాలి. సంస్కృతి పాత్ర లో ఉండే రష్మిక ట్రైన్ ఎపిసోడ్ లో ఉన్న హీరో మహేష్ బాబు ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతుంది. అయితే తనకు ఇంతకు ముందే వేరే అతనితో పెళ్లి నిశ్చయం అయిపోయిగా ఆమె తండ్రి రావు రమేష్ చూసిన సంబంధం వద్దని మహేష్ ను ఇంప్రెస్ చేసేందుకు ట్రైన్ లో నానా పాట్లు పడుతుంది.

 

ఇదంతా ఒక ఎత్తు అయితే తర్వాత రష్మిక బావగా సుబ్బరాజు ఎంట్రీ ఇస్తాడు. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా ఉండే సుబ్బరాజు రేష్మిక లైఫ్ లో ఉన్న మహేష్ బాబు ని తీసేసి అతను ఎంట్రీ ఇచ్చి ఆమెను కచ్చితంగా పెళ్లాడతానని రష్మిక తండ్రి రావు రమేష్ తో సవాలు చేస్తాడు. అందుకు రావు రమేష్ ఒరేయ్ తన మనసులో ఉన్నాడు నువ్వు డీల్ చేసే క్రిమినల్స్ కంటే చాలా డేంజర్ రా అంటాడు. అప్పుడు సుబ్బరాజు చెప్పే డైలాగ్ లేడీస్ ఫామ్ లో ఉన్నోడికే పడతారు అన్నది థియేటర్ లో బాగా క్లిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: