ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా బరిలో నిలిచిన రెండు పెద్ద చిత్రాల్లో ఒకటైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మొదటి షో పడిపోయింది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన జత కట్టింది. కామెడీ ప్రధాన బలం గా చెప్పబడే అనిల్ రావిపూడి మాత్రం ఈ సినిమాలో మాస్ సన్నివేశాలను పేకాట ఆడేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా మరీ ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ బాబు చింపి ఆరేశాడు. చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టిన విజయశాంతి కూడా తనదైన శైలిలో ఈ చిత్రం విజయంలో తన పాత్ర పోషించింది.

 

అయితే సినిమా మొత్తంలో మొదటి నుంచి చాలా హై ఇవ్వబడిన ట్రైన్ ఎపిసోడ్లో రష్మిక మహేష్ బాబుని చూసిన వెంటనే ప్రేమలో పడిపోతుంది. మొదటి నుంచి తనకు అడ్డుగా ఉన్న ఆమె తండ్రి రావు రమేష్ చివరికి అతనే స్వయంగా మహేష్ బాబు ని తన కూతురిని పెళ్లి చేసుకోమని వేడుకుంటాడు. మనం ఇందాక మాట్లాడుకున్న ట్రైన్ ఎపిసోడ్ గురించి ప్రస్తావిస్తూ మహేష్ బాబు ఒక్కరోజు రైలు ప్రయాణానికే నాకు చుక్కలు చూపించింది... ఇలాంటి అమ్మాయితో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి అని రావు రమేష్ ను ప్రశ్నిస్తాడు.

 

ఇకపోతే మనం f2 సినిమాలో చూసినట్లయితే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా అతితెలివితో... కంత్రీ తెలివితేటలతో ఉంటారు. అచ్చం అలాగే ఇక్కడ కూడా వారి క్యారెక్టర్ ను డిజైన్ చేసిన అనిల్ రావిపూడి చివర్లో ఒక మంచి కామెడీని జనరేట్ చేశాడు. రష్మిక ఫ్యామిలీ అంతా కలిసి మహేష్ తాను రశ్మిక ను ఎలా పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించినప్పుడు ఈ తర్వాత ఏమిటి అని అతనిని అడగగా వెంటనే మహేష్ 'ఉ' అనగానే పెళ్లికి 'ఉ' కొట్టేశాడు అని అంటారు. ప్రేక్షకులంతా వెళ్ళిపోతున్నప్పుడు స్క్రీన్ మీద ఈ సన్నివేశం బాగా నవ్వులు పూయించింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: