సూపర్ స్టార్ మహేష్ బాబు, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంతేకాదు మహేష్ కెరీర్‌లో బిజినెస్‌మ్యాన్, పోకిరి సినిమాల తరువాత అంత త్వరగా షూటింగ్ పూర్తైన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ఇక ఇప్ప‌టికే ఓవర్సీస్‌లో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఆంధ్రాలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. మొదటగా ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ తో పాటు అక్కడ వచ్చే యాక్షన్ సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. అనంతరం వచ్చే సాంగ్, ఆపై వచ్చే ట్రైన్ ఎపిసోడ్స్, కామెడీ సీన్స్ ప్రేక్ష‌కుల‌ను హిలేరియస్‌గా న‌వ్విస్తుంది. అయితే వెరీ సింపుల్ స్టోరీ లైన్ తో మహేష్ బాబు ప్రెజంటేషన్, ఎలివేషన్ సీన్స్ మరియు కొంత కామెడీ మీద నడిచే సినిమా ఇది. 

 

మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, స్పెషల్లీ డాన్సులలతో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ ఎలివేషన్స్ సినిమాకి హైలైట్ అయితే వెరీ సింపుల్ స్టోరీ లైన్. పెద్ద కిక్ ఇవ్వని క్లైమాక్స్, అనుకున్న స్థాయిలో కామెడీ వర్క్ అవ్వకపోవడం నిరాశ పరిచే అంశాలు. ఓవర్ఆల్‌గా ఓవర్ ఆల్ గా ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకు కావలిసిన హంగులన్నీ కూడా ఉన్నప్పటికీ, మెయిన్ కథలో మాత్రం అంత ప‌ట్టు ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌రి భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ చిత్రాన్ని ముందు ముందు ప్రేక్ష‌కులు చూడ‌డానికి ఎంత వ‌ర‌కు ఆస‌క్తి చూపుతారో చూడాలి. కాగా, ముందు నుంచి సినిమాకు భారీగా ప్రమోట్ చేయ‌డం, సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజులు ఉన్నాయని అనీల్ ఊరించడంతో క‌లిసొస్తుంద‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: