మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కేవలం ఐదు నెలల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమాకు ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ యూట్యూబ్ లో మంచి సక్సెస్ సాధించడం జరిగింది.
మహేష్ బాబుతో తొలిసారి ఈ సినిమా ద్వారా జత కట్టింది రష్మిక మందన్న. అలానే సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు ఓవరాల్ గా యావరేజ్ టాక్ ని అందిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కథను ఎక్కువగా కామెడీతోనే నడిపి, సినిమా కోసం బలమైన కథను మాత్రం ఎంచుకోవడంలో మాత్రం తడబడ్డాడని అంటున్నారు.
మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం ఆశించిన రేంజ్ లో లేదంటున్నారు. జస్ట్ యావరేజ్ కామెడీ, మహేష్ ఎలివేషన్, ప్రజెంటేషన్, ఇంటర్వెల్, ఫస్టాప్ సూపర్ అని, అయితే కొన్ని చోట్ల పేలని కామెడీ, రష్మికను సరిగా వాడుకోలేకపోవడం, విజయశాంతికి లేని ప్రాధాన్యం, సెకండాఫ్, కథ లేకపోవడం వంటివి మైనస్లు గా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి యావరేజ్ టాక్ ఉందని, రానున్న మిగతా రెండు సినిమాలను బట్టి ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందని తేల్చేస్తున్నారు. సినిమాలో పాటలు, మహేష్ డ్యాన్సుల వంటివి బాగున్నాయని, అలానే ఇంటర్వెల్, ట్రైన్ కామెడీ సీన్స్ మాత్రం ఆకట్టుకున్నట్లు చెప్తున్నారు. మరి ఇకనైనా అనిల్, కేవలం కామెడీ మీదనే కాక కథ మీద కూడా దృష్టి పెడతాడేమో చూడాలని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. ఇక మరి కొద్దిసేపట్లో పూర్తి రివ్యూ రానుంది....!!