నట సింహం.. నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ భార్యకు దైర్యం చెప్పారట.. ఎందుకు దైర్యం చెప్పారు అని అనుకుంటున్నారు కదా ? అదేనండి.. ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్ వచ్చింది అంట.. అందుకని.. ఆమెకు దైర్యం చెప్పి.. ఆర్ధికంగా సహాయం చేశారట. తల్లి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారట. 

 

టెన్షన్ పడుతున్నారా ? ఆగండి కాస్త అక్కడే.. బాలయ్య చాలా దురుసు వ్యక్తి అని.. అభిమానుల పట్ల చాలా కఠినంగా ఉంటారని, బాలయ్య తన అభిమానులను తన్నినా రోజులు కూడా ఉన్నాయని, అప్పుడప్పుడు ఇండస్ట్రీలో వారిపై కూడా చెయ్యి చేసుకున్నారని ఇండస్ట్రీలో వారికీ.. బయట వారికీ అందరికి తెలిసిన విషయమే.. 

 

కానీ బాలయ్య మనసు వెన్నలాంటిది అని.. ఈ ఎన్టీఆర్ భార్యకు క్యాన్సర్ వస్తే కానీ అర్థం కాలేదు. టెన్షన్ పడకండి.. ఎన్టీఆర్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ కాదు.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నందమూరి తారక రామారావు పాత్రలో నటించిన పి.విజయ్ కుమార్ భార్యకు క్యాన్సరట. 

 

దీంతో ఆ ఎన్టీఆర్.. అతని భార్యని తీసుకొని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు.. ఆ బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు చెప్పాడట. 

 

ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరయ్యా మా బాలయ్యకు అభిమానుల విలువ మనిషి విలువ తెలియదు అనింది.. చూశారా ? ఎంత మంచి వాడో మా బాలయ్య అని అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: