సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కన్నడ బ్యూటి రష్మిక మందన్నా హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంతో టాలీవుడ్ లేడీ సూపర్స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రొపెసర్ భారతి అనే పవర్ ఫుల్ పాత్రలో ఆమె కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ యూట్యూబ్ లో మంచి సక్సెస్ సాధించడం జరిగింది. ఇక ఈ సినిమా కోసం అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ టైమ్ రానెవచ్చింది. వాస్తవానికి ఈ చిత్రం మొదలయ్యినప్పటి నుంచీ మంచి హడావుడి చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ రోజురోజుకు అంతే స్థాయిలో పెంచుతూ వెళ్తూ ఈ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసారు. అలా ఎదురు చూసిన ఈ బొమ్మ ప్రీమియర్స్ తో పడేసరికి అటు ఆఫ్ లైన్ ఇటు ఆన్ లైన్ లో మహేష్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్లో చేస్తున్నారు. అలాగే రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో అదరగొట్టిన తర్వాత ఆ మలి చిత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ అయ్యి హిట్ కొట్టాలని మహేష్ ఫ్యాన్స్ కొరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా థియేటర్ లో సీన్స్ పెట్టేస్తున్నారు. కాగా, సినిమా పరంగా చూస్తే.. ఏదో ఒక చిన్న కథను తీసుకుని దాని చుట్టూ కామెడీ ఎక్కువగా అల్లేసి దాన్ని కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్తో తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఓ లేడీ ప్రొఫెసర్ను ఇబ్బంది పెట్టే ఓ మంత్రికి బుద్ధి చెప్పడం.. అది కూడా ఆ ప్రొఫెసర్ కుమారుడు ఆర్మీలో చనిపోతే ఆ ప్లేస్లోకి హీరో ఎంట్రీ ఇవ్వడమే కథ. ఓవర్ ఆల్ చూసుకుంటే కథలో కొత్తదనం లేకపోయినా కామెడీ యాడ్ చేసి బండి లాగేశాడు దర్శకుడు. మరోవైపు మహేష్ ఫ్యాన్స్ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రచ్చ ఓ రేంజ్లో చేస్తున్నారు. మరి వీరి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి.