సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మీక హీరో హీరయిన్లుగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వ‌రు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.. ఈ చిత్రం నుండి విడుదల అయిన అన్నీ సినిమాపై భారీ అంచనాలు అందుకున్నాయి.. అందుకనే ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ను అందుకుంది కాగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కాబోతుంది.. 

 

తాజాగా ఈరోజు ఈ చిత్రం విడుదలైంది.. ముందుగా అనుకున్న విధంగా ఈ చిత్రం మంచి హిట్ నీ అందుకుంటుంది అని మహేష్ అభిమానులు అభిప్రపడ్డారు..కానీ తీరా చూస్తే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు ఈ చిత్ర పరిస్థితి మారింది. ఫస్ట్ ఆఫ్ లో సినిమా కొంచెం కామెడీగా సాగినా కూడా సెకండ్ ఆఫ్ లో ప్రేక్షకులు బోర్ లాగా ఫీల్ అవుతున్నారు.. ఎదో ఉంటుంది అని వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా బోర్ కొట్టడంతో ఇంటర్వెల్ కే వెనక్కీ వస్తున్నారు..

 

అసలు  విషయానికొస్తే.... కెప్టెన్ అఫ్ ది షిప్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. రాను రాను ఈయన సినిమాల్లో కథ అనేది కొరవడుతోంది. అది ఈ ‘సరిలేరు నీకెవ్వరు’లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వెరీ వెరీ సింపుల్ లైన్ ని కథగా తీసుకున్నారు. అందుకే క్లైమాక్స్ కి వచ్చేసరికి కథ ఏం లేక సినిమా తేలిపోయింది. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కథనంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది. అందుకే మ‌హేష్‌బాబు హీరోయిజ‌మే సినిమాను హైలెట్ చేసిందే కాని అనిల్ రావిపూడి క‌థ‌, క‌థ‌నాలు కాదు...

 

మహేష్ ఒక్కడే ఈ సినిమాను తన భుజాలపై మోసాడు.. కానీ, ఎం లాభం సినిమా విజయానికి 50-50 చాన్స్ లు ఉన్నాయి.. మొత్తని అనిల్ చేసిన కొత్త ప్రయోగం మహేష్ కి మాత్రం పెద్దగా కలిసిరాలేదు..అలా ఈ సినిమా ఓ మాదిరిగా ఆకట్టుకుంటుంది.. సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే ఈ సినిమా బాగానే వసూళ్లు చేస్తుందని అర్థమవుతుంది.. మరో సినిమాలో అయిన మహేష్ కు మంచి మార్కులు వస్తాయేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: