ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీమియర్ షోలు అర్దరాత్రి నుండి ప్రారంభం కావడంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గుంటూరు విశాఖపట్నం రాజమండ్రి లాంటి కీలక పట్టణాలలో ‘సరిలేరు నీకెవ్వరు’ మ్యానియా ప్రారంభం అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా టాక్ కు సంబంధించిన లీకులు బయటకు వస్తున్నా స్పష్టంగా ఈ సినిమా పై సగటు ప్రేక్షకుడుడు ఇచ్చే తీర్పు తెలియడానికి మరి కొన్ని గంటలు పట్టే ఆస్కారం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని చిన్న పట్టణాలలో ఈరోజు అన్ని ధియేటర్స్ లోను ఈ మూవీ మార్నింగ్ షోలు వేస్తున్నారు అంటే ఈ మూవీ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. అయితే ఈ మూవీ టాక్ విషయమై జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అప్పుడే నెగిటివ్ ప్రచారానికి కూడ చాలామంది సిద్ధం అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీని ఒక బ్రహ్మాస్త్రం లా మహేష్ బాబు లుంగీ సెంటిమెంట్ గట్టెక్కిస్తుందని మహేష్ అభిమానులు గంపెడు ఆశలతో ఉన్నారు. ఈ మూవీలో చివరి పాటగా రాబోతున్న ‘మైండ్ బ్లాక్’ సాంగ్ లో మహేష్ లుంగీ కట్టుకుని వేసిన మాస్ స్టెప్ ఈ మూవీని రికార్డుల స్థాయికి తీసుకు వెళుతుంది అని భావిస్తూ ఒక కొత్త సెంటిమెంట్ ను ఈ మూవీ విడుదల రోజున తెర పైకి తీసుకు వచ్చారు. 

ఇలా ఈ లుంగీ సెంటిమెంట్ గురించి చర్చించుకోవడానికి ఒక కారణం ఉంది. గతంలో మహేష్ బాబు నటించిన ‘పోకిరి' ‘భరత్ అనే నేను' ‘శ్రీమంతుడు' సినిమాల్లో మహేష్ లుంగీ వేసుకుని డ్యాన్స్ చేసిన పాటలతో పాటు ఆ మూవీలు మూడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీనితో ఇదే సెంటిమెంట్ మహేష్ సినిమాను గట్టేక్కిస్తుంది అని భావిస్తూ ధియేటర్స్ వద్ద ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే మహేష్ అభిమానులు చేస్తున్న హడావిడితో సంక్రాంతి పండుగ నాలుగు రోజులు ముందుగానే వచ్చేసిందా అన్న ఫీలింగ్ కలుగుతోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: