టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుండగ్గా అర్ధరాతి నుంచే ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేశారు. ఇక సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత ఒక కీలక పాత్రతో సరిలేరుతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సంగీత వెన్నెలకిషోర్, సత్యదేవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక సూపర్ స్టార్ ఆర్మీ మేజర్ పాత్రలో అదిరిపోయే ఎంట్రీ తో పాటు రాం లక్ష్మన్ లు డిఫ్రెంట్ గా కంపోజ్ చేసిన యాక్షన్ సీన్ అందరినీ ఆకట్టుకుంటుందట. ఈ నేపథ్యంలో వచ్చే సాంగ్, కామెడీ సీన్స్ ప్రేక్షకులని బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాయట. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 

 

ఫస్టాఫ్ ఇలా కామెడీ తో లాగించినప్పటికి సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా సాగిందట. ఇక ఈ సెకండాఫ్ లోనే ప్రకాష్ రాజ్ కు హీరో మహేష్ బాబు వార్నింగ్ ఇచ్చే సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, ఆ సీన్స్ లో కూడా దర్శకుడు కావాలని కామెడీ పుట్టించడం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు. అంతేకాదు ఇది మరీ సిలీగా ఉందని చెప్పుకుంటున్నారు. ఇక అనిల్ రావిపూడి రాసుకున్న కథ ఏమాత్రం ఆకట్టుకోని విధంగా ఉండటం మహేష్ సినిమా చేద్దాం అనగానే హడావుడిగా కొన్ని కామెడీ సీన్స్ ఏసుకొని బయలుదేరిపోయాడ సినిమా చూసిన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. స్టార్ సినిమాకే కాదు ఏ సినిమాకైనా కథే కీలకం..అటువంటిది సరిలేరు కథ ఎక్కడ మొదలవుతుందో ఎటు వెళుతుందో అర్థం కాక ప్రేక్షకులు అయోమయంలో పడుతున్నారట. 

 

మొత్తంగా చూస్తే అక్కడడక్కడా వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు రెండు సాంగ్స్ కూడా మాత్రమే ఆకట్టుకునే విధంగా ఉన్నాయని జనాలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రీ క్లైమాక్స్ కాస్త పరవాలేదనిపించే స్థాయిలో ఉందట. ఇక క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకుమ్నేలా ఉందని అంటున్నారు. ఓవర్ ఆల్ గా ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకు కావలిసిన ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అసలు  కథ ఏమాత్రం లేకుండా అనిల్ కంప్లీట్ గా కామెడీ మీద ఆధారపడి సూపర్ స్టార్ నే కాదు ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేశాడని అంటున్నారు. అంతేకాదు అనీల్ శ్రీను వైట్ల లాగా పనికిమాలిన కామెడీ పెట్టి జారిపడ్డాడమి కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: