ఆంధ్రప్రదేశ్ లో అర్దరాత్రి 12 గంటల నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ షోలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మటుకు ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి షో ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఈ షోలు నడుస్తున్న ధియేటర్స్ ముందు పండుగ వాతావరణం కనిపిస్తుంటే ఈరోజు మొత్తానికి ఎక్కడా ఒక్క టిక్కెట్ కూడ దొరకని పరిస్థితి కనిపిస్తోంది.

వాస్తవానికి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో పాటు ఈ సినిమా యూనిట్ సభ్యులు అందరికీ ఒక స్పెషల్ ప్రీమియర్ షోను ఏర్పాటు చేయాలని భావించిన ఈ మూవీ నిర్మాతలు ఆఖరి నిముషంలో తమ ప్లాన్ ను మార్చుకున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం నిన్న అర్దరాత్రి తన ఇంటిలోని హోమ్ ధియేటర్ లో ఈ మూవీని ప్రత్యేకంగా తన కుటుంబ సభ్యుల కోసం అదేవిధంగా తనతో సన్నిహితంగా ఉండే కొందరు సెలెబ్రెటీల కోసం ఈ మూవీని ప్రత్యేకంగా చూపించాడు అని వార్తలు వస్తున్నాయి.

మహేష్ ఆహ్వానం మేరకు అతడి ఇంటికి వెళ్ళి ఈ సినిమాను చూసిన కొందరు సెలెబ్రెటీలు తమ సన్నిహితులకు షేర్ చేసిన టాక్ ప్రకారం సూపర్ అంటూ కామెంట్ చేసినట్లు టాక్. అంతేకాదు ఈ మూవీలోని ఇంటర్వెల్ ట్విస్ట్ ట్రైన్ కామెడీ ఎపిసోడ్ లతో పాటు మహేష్ ఎనర్జీ లెవెల్స్ ఈ మూవీని బ్లాక్ బస్టర్ స్థాయికి తీసుకు వెళతాయని ఇప్పటికే ఈ మూవీని మహేష్ ఇంట్లో ప్రవేట్ షోలో చూసిన సెలెబ్రెటీల అభిప్రాయం అని తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా ఇప్పటికే అమెరికాలో ప్రారంభం అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీమియర్ షోలు వల్ల 750 – 800 కె డాలర్ల కలక్షన్స్ రావడంతో అప్పుడే ‘సరిలేరు నీకెవ్వరు’ హాఫ్ మిలియన్ మార్క్ ను దాటిపోయింది అని వార్తలు వస్తున్నాయి. మహేష్ కు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ ఈ వీకెండ్ కు 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేయడం చాల సులువైన పని అని అంటున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: