అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు విడుదలైంది. మహేష్ కు జోడీగా రష్మిక మందన్నా నటించగా 13 సంవత్సరాల తరువాత విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న మహేష్ బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 
 
ఈరోజు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కానీ ఫస్టాఫ్ లో కామెడీ పేరుతో చేసిన అతి మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉంది. కథనాన్ని ఆసక్తికరంగా మలచాలనే ఆలోచనతో అనిల్ రావిపూడి కామెడీ పేరుతో పాత్రలతో చాలా అతి చేయించాడు. మొదట్లో ఈ అతి కామెడీ బాగానే అనిపించినా రానురాను ప్రేక్షకులకు అవే రొటీన్ డైలాగులు, అతి కామెడీ వెగటు పుట్టిస్తుంది. 
 
దర్శకుడు అనిల్ రావిపూడి గత సినిమాల మాదిరిగా కాకుండా ఈ సినిమాలో కామెడీని బలవంతంగా రుద్దినట్టు ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కామెడీ పేరుతో రష్మిక మందన్న చేసే నటన అతి అనిపిస్తుందని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి ఎంచుకున్న కథ, కథనం మరీ రొటీన్ గా ఉండటం కూడా సినిమాకు మైనస్ గా మారాయి. 
 
సరిలేరు నీకెవ్వరు సినిమాకు మహేష్ బాబు మైండ్ బ్లాకింగ్ నటన హైలెట్ గా నిలిచింది. కొండారెడ్డి బురుజు ఇంటర్వెల్ బ్లాక్, విజయశాంతి పాత్రలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ట్రైన్ కామెడీ ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ కామెడీ పేరుతో పాత్రలతో అతి చేయించడం కొంత మైనస్ గా మారింది. కథ, కథనం రొటీన్ గా ఉండటం, పాటలు బాగానే ఉన్నప్పటికీ నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా లేకపోవడం సినిమాకు మైనస్ గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: