సరిలేరు నీకెవ్వరూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాములమ్మ కీలక పాత్ర పోషించింది. 

 

అయితే సినిమా చుసిన ప్రేక్షకులు సినిమా అంత అద్భుతంగా ఏం లేదు అని.. మాములు సినిమాలనే ఉంది అని పబ్లిక్ టాక్ లో కొందరు చెప్పగా.. మరి కొందరు మాత్రం సినిమా అదిరిపోయింది అని చెప్పి తికమక పెట్టించారు. అందుకే ఈ సినిమాను చూసేందుకు ప్రత్యేకంగా వెళ్లగా నాకు కూడా అదే అనిపించింది. సినిమాలో ఏం లేదే ? మామూలుగానే ఉందే ? అని. 

 

ఇంకా అసలు వివరాల్లోకి వెళ్తే.. సినిమా అంత కూడా పిచ్చి పిచ్చి కామెడీ సీన్స్ తో కామన్ గా వెళ్లిపోయింది. అన్ని మామూలుగ ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేవు. సినిమాని అంత విజయశాంతినే కాపాడింది. సినిమాలో అంత అద్భుతమైన సన్నివేశాలు ఏమి లేకపోగా.. మిలిటరీ ఎపిసోడ్ కూడా అనంతంతమాత్రమే ఉంది. దీంతో ఈ సినిమా కూడా మామూలుగానే.. ఇంకా అంతే కాదు.. 

 

అవే ఫైట్లు, అవే పాట‌లు, అవే డ్యాన్సులు, అదే డైలాగ్ డెలివ‌రీ.. మ‌హేష్ చెప్పిన‌ట్టు ప్ర‌యోగాలు చేయ‌డానికి బాగుంటాయి... అయితే తాను వ‌న్ చేశాడు... ప్ర‌యోగం ప్లాప్ అయ్యింది కానీ మంచి పేరు వ‌చ్చింది. అందుకే త‌మ‌కు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కావాల‌ని.. ఉన్న‌ది ఉన్న‌ట్టు నిజాయితీగా చెప్పాడు. ఇక స‌రిలేరు కూడా ఫ్యూర్ మాస్ కామెడీ దోశె.. స్పెషాలిటీ వంటేం కాదు అన్న‌ట్టుగా ఉంది... పైన చెప్పిన‌ట్టు అవే ఫైట్లు పాత క‌థ‌, కామెడీ మాత్ర‌మే పేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి: