సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి అంతటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి సినిమా హాల్స్ అన్నింటిని ఫుల్ చేసేస్తోంది. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత స్టార్ హీరోయిన్ అయినా విజయశాంతి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా అంత ఆమెపైనే ఢిపెండ్ అయ్యేలా చేశాడు.  

 

వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఫస్టాఫ్ లో హీరోను ఎలివేట్ చేసేందుకు అనిల్ రావిపూడి ఏకంగా ఆరేడు సీన్లు వాడుకున్నాడు. అయితే అవేవీ ఈ సినిమాపై అంచనాలు పెంచలేక పోయాయి. మహేష్ సన్నివేశం అయినా మిలటరీ ఎపిసోడ్ పూర్తిగా తేలిపోయింది. కేవలం ఒక ఫైట్ ఒక పాట పెట్టాలని మిలటరీ ఎపిసోడ్ డిజైన్ చేసినట్లు ఉంది. ఆ తర్వాత ఎందుకో అర్థం కాలేదు ఆ వెంటనే తమన్నా ఐటెం సాంగ్ చేస్తోంది. 

 

ఆ వెంటనే కర్నూల్ వెళ్ళేందుకు బయలుదేరిన మహేష్ ఏకంగా 30 నిమిషాలపాటు ట్రైన్ జర్నీ చేస్తాడు. ఈ ట్రైన్ జర్నీలోనే కాస్త కామెడీ జనరేట్ అవుతుంది. అక్కడే హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం హీరోయిన్ రష్మిక తను మహేష్ రేప్ చేశాడని పెళ్లి చేసుకోవాలని పెట్టడం వంటి సీన్ నడుస్తుంది. ఈ సీన్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

 

ఇక కర్నూలు కొండారెడ్డి బురుజు ఎపిసోడ్ అయితే ఒక్కడు 1 సినిమాతో పోలిస్తే చాలా పేలవంగా ఉంది. ఇక హీరోయిన్ రష్మిక మందనతో లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకోలేదు. అసలు చెప్పాలంటే మహేష్ రష్మిక మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఇవి అన్ని చూసిన ఫ్యాన్స్ స్టార్ హీరోయిన్ అయినా విజయశాంతి ఎపిసోడ్ల మీదే అందరూ ఆశలు పెట్టుకుంటారు. సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్లలో విజయశాంతి నటన బాగుంది కూడా.. సీనియర్ కావడంతో ఆమె చాలా బాగా నటించింది. చెప్పాలంటే సినిమా అంత కూడా విజయశాంతిపైనే డిపెండ్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: