త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన "అల వైకుంఠపురములో చిత్రం జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రమ్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

 

అయితే ఈ సినిమా అనంతరం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది. ఎర్ర చందనం స్మగ్లిమ్గ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా కనిపించనున్నారట. ఇప్పటి వరకు బన్నీ అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఒక్కసారిగా లారీ డ్రైవర్ గా అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంత మాస్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 

మరి ఈ వార్త ఎంత మేరకు నిజం అన్నది చూడాలి. ఈ సినిమలో ఎక్కువ మంది కొత్తవాళ్ళే ఉంటారట. ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడు. రంగస్థలం తో నాన్ బాహుబలి రికార్డు అందుకున్న సుకుమార్ ఈ సినిమాతో మళ్ళీ రంగస్థలం లాంటి హిట్ కొడతాడేమో చూడాలి.

 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా, బన్నీ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. మిగతా నటీనటుల విషయం కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: