సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి అంతటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం కోటి ఆశలతో ఎదురు చుసిన మహేష్ బాబు ఫ్యాన్స్ కల నెరవేరింది. 

 

అయితే సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కు.. విజయశాంతి ఫ్యాన్స్ కు తప్ప ఎవరికీ నచ్చలేదట. అదేం అంటే సినిమా అంత సోది ఏ ఉంది అని అంటున్నారు ఓవర్సీస్ లో. ఇంకా అసలు విషయానికి వస్తే మొత్తం అంత కూడా సోది డబ్బా అంట.. సినిమా. ఏవో డైలాగులతో మాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా రూపొందింది. అంత సోది కామెడీతో సినిమా హిట్ కొట్టేయాలనుకున్నారని ఓవర్సీస్ టాక్. 

 

అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత స్టార్ హీరోయిన్ అయినా విజయశాంతి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా అంత ఆమెపైనే ఢిపెండ్ అయ్యేలా చేశాడు. సినిమా లాస్ట్ వరుకు అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పేలా లేదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దీంతో సినిమా మన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకొని వసూలు చేసుకుంటుంది కానీ అక్కడ చేసుకోలేదు అని చెప్పగలం. 

 

అది ఎక్కడ అంటే.. యావ‌రేజ్ టాక్‌తో బాక్సాఫీస్ జ‌ర్నీ స్టార్ట్‌ అయ్యింది... ఎలా అయినా సంక్రాంతి సీజన్ కాబట్టి ఆంధ్ర - తెలంగాణ వరకూ ఈ సినిమాకి డోఖా లేదు, కానీ కామెడీ అనుకున్నంత వర్కౌట్ కాకపోవడం, మరీ రెగ్యులర్ మాస్ మసాలా మూవీలానే ఉండడం వలన ఓవర్సీస్ లో మాత్రం బిజినెస్ చేసిన టార్గెట్ ని రీచ్ అవ్వడం కష్టం అని పక్కాగా చెప్పగలం.

మరింత సమాచారం తెలుసుకోండి: