సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వినిపిస్తోంది. చాలా సంవత్సరాల తరువాత విజయశాంతి, సంగీత ఈ సినిమాలో నటించటంతో సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లోని కొన్ని డైలాగులు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. 
 
ఫస్ట్ హాఫ్ లో పవర్లో ఉన్నోళ్లం ఒక్క అరగంట పవర్ తీయలేమా ?, చేతిలో కిళ్ళీ పెట్టి పెళ్ళి చేసేస్తారా?, బాబూ వయస్సులో ఉన్న ఆడపిల్లలను సిస్టర్ అనొద్దు - తట్టుకోలేరు, భయపడేవాడే బేరాల కొస్తాడు - మన దగ్గర బేరాల్లేవమ్మా! డైలాగులు హైలెట్ గా నిలిచాయి. అనిల్ రావిపూడి సినిమాలో పంచ్ డైలాగులను అద్భుతంగా రాశాడు. సినిమాలోని పాత్రలతో అనిల్ రావిపూడి చెప్పించిన డైలాగులు చక్కగా కుదిరాయి. 
 
ఇప్పటికే ఏపీలోని చాలా చోట్ల స్పెషల్ షోలు పడగా అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని అభిమానుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు మహేష్ బాబును ఎలా చూడాలనుకున్నామో అలానే చూపించారని చెబుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్టాఫ్ లో ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. 
 
కథ, కథనం రొటీన్ గానే ఉన్నప్పటికీ కామెడీ, యాక్షన్ సీన్స్ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఒక మంచి మాస్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోందని చెబుతున్నారు. మహేష్ ఫ్యాన్స్ కు విందు భోజనంలాంటి సినిమా అని చెబుతున్నారు. సినిమాలో మహేష్ బాబు డ్యాన్సులు అద్భుతంగా ఇరగదీశాడని మైండ్ బ్లాక్ సాంగులో స్టెప్పులు ఇరగదీశాడని దేవీశ్రీ ప్రసాద్ సినిమాకు అందించిన పాటలు బాగున్నాయని నేపథ్య సంగీతం విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: