సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానేవచ్చింది. సంక్రాంతి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న (నేడు) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. గత కొద్దిరోజులుగా సందేశాత్మక సినిమాలు చేసుకుంటూ వస్తున్న మహేష్ ఈ సారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మహేష్ మొదటిసారి ఆర్మీ లుక్ లో కనిపించడం, 13 ఏళ్ల తరవాత లేడి అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోల ప్రదర్శన జరుగగా సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కాగా యూఎస్ ప్రీమియర్స్ నందు మహేష్ సరిలేరు నీకెవ్వరు దుమ్మురేపుతోంది. తాజా సమాచారం మేరకు.. ఇప్పటివరకు సరిలేరు నీకెవ్వరు యూఎస్ ప్రీమియర్స్ ద్వారా $ 620,000 లక్షలు వసూలు చేసింది. అక్కడ రాత్రి పూర్తయ్యే నాటికీ ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కలదు.
అంటే ప్రీమియర్ షోస్ ద్వారానే సరిలేరు నీకెవ్వరు మూవీ వన్ మిలియన్ వసూళ్లకు చేరువ అయ్యేలా కనిపిస్తోంది. కాగా, అనిల్ రావిపూడి మొదటి నుంచి చెబుతున్నట్టుగా ఈ సినిమాకు ట్రైన్ ఎపిసోడ్ హైలైట్గా నిలిచిందట. ఈ సీన్ స్టార్టింగ్ టూ ఎండింగ్ ప్రేక్షకులు పడిపడి నవ్వులే నవ్వులని టాక్. మొత్తం మీద.. పేరుకు తగ్గట్టుగానే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేశ్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కెరీర్లో తొలిసారి మహేష్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసినా కూడా ఎక్కడా బెరుకు లేకుండా పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించి తనకు తిరుగులేదని దర్శకుడు మరోమారు నిరూపించుకున్నాడు.