ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. అదేనండి మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా రిలీజ్ గూర్చి.... ఈరోజు సినిమా హాల్లో సందడి చేస్తుంది.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో హీరో హీరోయిన్లుగా మహేష్ బాబు మరియు రష్మిక నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక ప్రత్యేక అలనాటి డైనమిక్ లేడీ అయిన విజయశాంతి కూడా ఒక ప్రొఫిసర్ పాత్రలో నటిస్తున్నారు..
ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు.. గతేడాది ‘మహర్షి’తో ప్రేక్షకులను పలకరించిన మహేశ్బాబు ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు.మరి ఈ సంవత్సరం ప్రిన్స్ అదృష్టం ఎలా ఉందో మరి?? అసలు సరిలేరు నీకెవరు సినిమా కధ ఏంటి? అనుకుంటున్నారా !!!
అజయ్ కృష్ణ (మహేశ్బాబు) ఆర్మీలో మేజర్. ధైర్య సాహసాలు కలిగిన ఆర్మీ అధికారి. కొందరు ఉగ్రవాదులు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేస్తారు. వారి చెర నుంచి విద్యార్థులను విడిపించేందుకు ప్రత్యేక ఆపరేషన్ కోసం రంగంలోకి దిగుతారు మహేశ్బాబు, అతని టీమ్. ఆ సమయంలో మేజర్ అజయ్ కృష్ణకు ఒక ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఆర్మీ నిబంధనలకు కట్టుబడి కర్నూలు బయలుదేరి వస్తాడు.
అక్కడ భారతి (విజయశాంతి) కర్నూలు మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్. కశ్మీర్లో ఆర్మీ మేజర్గా పనిచేసే అజయ్కృష్ణ.. వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతిని వెతుక్కుంటూ కర్నూలుకు ఎందుకు రావాల్సి వచ్చింది? అజయ్ కర్నూలు వచ్చేసరికి భారతి ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు? ఆ పరిస్థితులకు కారణం ఎవరు?
ఆమెను ఆ ఆపద నుంచి అజయ్ ఎలా రక్షించాడు? అసలు ప్రొఫెసర్ భారతికి అజయ్కృష్ణకు ఉన్న సంబంధం ఏంటి? మంత్రి నాగేంద్రప్రసాద్ (ప్రకాష్రాజ్) కథేంటి? చివరకు అతను ఏమయ్యాడు? మధ్యలో సంస్కృతి (రష్మిక) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!మహేశ్బాబు నుంచి ఒక మాస్ ఎంటర్టైనర్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ ‘సరిలేరు నీకెవ్వరు’తో ఎట్టకేలకు నెరవేరింది. సగటు మహేశ్ అభిమాని ఏం కోరుకుంటాడో అవన్నీ రంగరించి తయారు చేసుకున్న కథలా అనిపిస్తుంది.
ఆర్మీ అధికారిగా మహేశ్ లుక్, యాక్షన్ ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తుంది. అదే సమయంలో ప్రొఫెసర్ భారతిని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపించాడు.విజయశాంతి, ప్రకాష్ రాజ్, రష్మిక మిగిలిన వారు కూడా ఎవరి పాత్రలో వారు వేరియేషన్స్ చూపించారు.. మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయింది.. ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో ఆయన మధ్యలో ఊపు అందుకుంది.