అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈరోజు విడుదలైంది. 13 సంవత్సరాల తరువాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తూ ఉండటంతో సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 
 
సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్ ఇరగదీశాడు. మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ బాబు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యాన్సులతో ఇరగదీశాడని చెప్పవచ్చు. ప్రేక్షకులు ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా అద్భుతంగా కుదిరిందని అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు డ్యాన్స్ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
అతి తక్కువ టైంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ బాబు గత చిత్రాలకు రాని విధంగా హైప్ వచ్చింది. డాంగ్ డాంగ్ పాటలో కూడా మహేష్ బాబు స్టెప్పులు పోకిరి సినిమాలో మహేష్ బాబును గుర్తు చేస్తాయి. మహేష్ బాబు, విజయశాంతి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమాకు కీలకమైన ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది. 
 
ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కొంచెం నెమ్మదించినా ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు. క్లైమాక్స్ విషయంలో అనిల్ రావిపూడి కొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు సరిలేరు నీకెవ్వరు సినిమా విందుభోజనం లాంటి సినిమా అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు మాత్రం కథ, కథనం మరీ రొటీన్ గా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక మంచి మాస్ ఎంటర్‌టైనర్‌ను చూపిన ఫీలింగ్ అయితే కలుగుతుందని ప్రేక్షకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: