తెలుగు బుల్లితెరపై అప్పుడూ.. ఇప్పుడు ఫిమేల్ యాంకర్లదే హవా ఉండేది. మొదటి సారిగా మెయిల్ యాంకర్ గా ప్రదీప్ మాచినేని తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు.  స్టేజ్ పై తోటి సభ్యులు .. అటు ఆడియన్స్ ఎవరూ హర్ట్ కాకుండా మంచి సమయస్ఫూర్తితో మాట్లాడటం ప్రదీప్ ప్రత్యేకత. ఎలాంటి వారినైనా తన మాటల చాతుర్యంతో ఇట్టే మాయచేసే ప్రదీప్ కొంత కాలంగా ఢీ డ్యాన్స్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.  ఆ మద్య కొంత కాలం ప్రదీప్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.. అందుకూ అన్ని షో లకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చాయి. 

 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని.. ప్రస్తుతం పలు షోస్ లో యాక్టీవ్ గా పాల్గొనబోతున్నానని రూమర్లు అస్సలు నమ్మోద్దని అన్నారు ప్రదీప్. ఈ మద్య అదిరింది కార్యక్రమంలో తనదైన కామెడీ టచ్ చేశారు. ఇక ప్రదీప్ కి మంచి క్రేజ్ తెచ్చిన షోలలో 'ఢీ' ఒకటి.  ఈ షోలో సుడిగాలి సుధీర్ తో యాంకర్ రవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. మంచి కామెడీ టైమింగ్ తో ఇద్దరు ఎంతో హుందాగా ఢీ షో నిర్వహించారు.  ఆ షో నుంచి ప్రదీప్ తప్పుకున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. వచ్చేవారానికి సంబంధించిన ప్రోమోలో ప్రదీప్ కనిపించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

 

ప్రస్తుతం జీ తెలుగు నిర్వహిస్తున్న ‘అదిరింది’ కామెడీ షోలో ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జబర్ధస్త్ నుంచి మెగాబ్రదర్ నాగబాబు ఈ కార్యక్రమానికి వచ్చి జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు యాంకర్ ప్రదీప్ ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ కారణంతోనే తనకు షూటింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఢీ  షో నుంచి తప్పుకుంటున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ప్రదీప్ వెండితెరపై చిన్నచిన్న పాత్రలతో మెరుస్తూ వచ్చిన, త్వరలో హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: