ఈ సంక్రాంతి బరిలో పందెం కోళ్లు నాలుగు తయారయ్యాయి. దర్భార్ తో రజినీ, సరిలేరు నీకెవ్వరు తో మహేష్ బాబు, అల వైకుంఠపురములో తో అల్లు అర్జున్.. ఇక ఎంత మంచివాడవురా తో కళ్యాన్ రామ్ లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దర్భార్ మూవీతో రజినీకాంత్ తెలుగు ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయారని టాక్ వినిపిస్తుంది. ఈ రోజు సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ అయ్యింది.. సాయంత్రం వరకు ఈ మూవీ టాక్ ఏంటో తేలిపోతుంది. రేపు అల వైకుంఠపురములో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ఏం మాయ చేస్తారో చూడాలి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లో దర్శకుడు త్రివిక్రమ్ బన్నీ చేత పలికించిన ఓ డైలాగ్ కూడా ట్రెండీగా ఉంది.
ఈ మూవీలో స్టైలిష్ స్టార్ ట్యాగ్కి తగ్గట్టుగానే.. అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్, ఫైట్స్ను ఈ సినిమాలో చాలా స్టైలిష్గా కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టైల్గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది" ప్రస్తుతం ఈ డైలాగ్కి ఒక్క రేంజ్లో రెస్పాన్స్ వస్తోంది. రేపు ఈ మూవీ రిలీజ్ సందర్బంగా ఇప్పటికే ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గతంలో త్రివిక్రమ్ నాకు మంచి హిట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆయన చెప్పిన కథ లైన్ నాకు నచ్చడంతో అంత గ్యాప్ తర్వాత ఈ మూవీకి ఓకే చెప్పాను అన్నారు.
ఈ సినిమాలో నా పాత్రను ఆయన చాలా గొప్పగా మలిచాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తాను. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో నేను ఉద్యోగిగా ఉంటే, నా పైఅధికారిగా పూజా హెగ్డే కనిపిస్తుంది. ఇక మా ఇద్దరి మద్య వచ్చే సన్నివేశాలు చూస్తూ కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో కావాలసినంత ఉన్నాయి. ఇక నా తండ్రి పాత్రలో మురళీ శర్మ నటించారు. ఏ మాత్రం పడని తండ్రీ కొడుకులుగా మేము తెరపై కనిపిస్తాము. మా కాంబినేషన్ సీన్స్ బాగా పేల్తాయి అని చెప్పుకొచ్చాడు.