స్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నిధి అగర్వాల్ బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆమె వద్దకు చాలా సినీ అవకాశాలు తన్నుకొస్తున్నాయి. అలాగే షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమాలకు కూడా ఆమెను పిలుస్తున్నారు ప్రజలు. దాంతో ఆమె రెండు చేతులా ఎంతో డబ్బు సంపాదిస్తుంది. మొన్నామధ్య రూ.90 లక్షల విలువైన కారు ని కొని అభిమానులకు భారీ ఝలక్ ఇచ్చింది. అదేవిధంగా ఆమె ఆ కారు నడుపుతూ ఉన్నటువంటి ఒక వీడియో ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి తన అభిమాన సంబరపరిచింది. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి దానికో మాట జోడించడంతో ఫాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు.


ఇంతకీ నిధి అగర్వాల్ ఫాన్స్ ని నొప్పించిన పోస్ట్ లో ఏం రాసుందంటే... 'మీరు పొద్దస్తమానం ఇంస్టాగ్రామ్ చెక్ చేసుకునే బదులు మిమల్ని మీరు పరిశీలించుకోండి.' అని నిధి అగర్వాల్ రాసింది. దాంతో 'నీకోసమే మిమేమి గంటల తరబడి వెదకడం లేదు, మిమ్మల్ని చూడట్లేదు. మాకు తెలుసు ఇంస్టాగ్రామ్ ఎంతవరకు చూడాలో', అని కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా... మరికొంతమంది మాత్రం.. తన ఫ్యాన్స్ యొక్క భవిష్యత్తును గురించి చెబుతూ తమ లో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి దానికి పదును పెట్టాలని నిధి అగర్వాల్ చెబుతున్నదని అంటున్నారు. ఏదేమైనా తాము ఎంతగానో అభిమానించే హీరోయిన్ ఇలా అనడం ఏంబాగోలేదని ఫాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. మరి తన ఫ్యాన్స్ యొక్క కోపం తగ్గాలంటే ఎటువంటి హాట్ ఫోటో ని త్వరలో షేర్ చేస్తుందో చూడాలిక.


ఇకపోతే, మున్నా మైఖేల్ హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె మొదటిగా బెంగళూరులో మోడల్ గా, డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా విజయం సాధించలేకపోయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి నిధి అగర్వాల్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: