స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా విడుదల కి ముందు నుంచీ ఆసక్తి ని రేకెత్తిస్తూనే ఉంది. ట్రెయిలర్ - సాంగ్స్ టీజర్ ఇలా అన్నింటా ఈ సినిమా తన మార్క్ ని చాటుకుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా విషయం లో మొదటి నుంచీ ఎంటర్టైన్మెంట్ ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాడు. మరి థియేటర్ లలో కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేశాడు . అదే ఈ సినిమా కి బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. కానీ మహేశ్ బాబు సంగతి పక్కన పెడితే ప్రతీ ఎమోషన్ కీ ప్రతీ కారెక్టర్ లొంచీ కామెడీ ని బయటకి లాగే ప్రయత్నం కాస్త అతి అనిపిస్తుంది. మిలిటరీ లో కూడా ఈ కుళ్ళు కామెడీ ఏంటి అంటూ థియేటర్ లలో కాస్త పెదవి విరుపులు వినిపిస్తాయి.

 

 

మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, రత్నవేలు ఫోటోగ్రఫిని, తమ్మిరాజు ఎడిటింగ్ ని అందించారు. ఒకప్పటి నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు విపరీతంగా ఉన్న తరుణం లో ఈ ఓవర్ యాక్షన్ కామెడీ ని జనాలు ఎలా తీసుకుంటారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ సినిమాలో విజయశాంతి భారతి అనే పేరుతో మెడికల్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తుంది.

 

 

30 సంవత్సరాల క్రితం మహేష్ బాబు తో కొడుకు దిద్దిన కాపురం సినిమా లో విజయశాంతి నటించింది. అలాగే తెలుగు తెరపై 13 సంవత్సరాల తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. అయితే హైప్ ఉన్నంతగా ఈ సినిమా లో ఆమె పాత్ర వర్క్ అవలేదు అనే మాట కూడా వినిపిస్తోంది. హీరోయిజం దగ్గర నుంచి ప్రతీ దాన్నీ కామెడీ గా చేయడం అనిల్ రావిపూడికే కుదిరింది.. ఇది అతి అని కొంతమంది అంటే కామెడీ అని మరికొంతమంది అంటున్నారు .. ఇక ప్రేక్షకులు తమ తీర్పు ఎలా చెప్తారో చూడాలి .. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: