హీరోయిన్ ఎంత అందంగా ఉంటే సినిమాకు అంత గ్లామర్ వస్తుంది. అందమైన హీరోయిన్ అయితే ఆ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. మరికొందరు తళుకుబెళుకులతో సినిమాకు గ్లామర్ అద్దుతారు. కొందరు హీరోయిన్లు ప్రేక్షకుల్లో డీసెంట్ గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. కానీ వారే సడన్ గా గ్లామర్ ఒలకబోస్తే.. అందులో వారు మరింత అందంగా కనిపిస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ సెన్షేషనల్ హీరోయిన్ రష్మిక మందన ఇలానే కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి.

 

 

సూపర్ స్టార్ మహేశ్ కు జోడీగా రష్మిక మందన నటించిన సరిలేరు నీకెవ్వరు ఈరోజు రిలీజ్ అయి ధియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాలో రష్మిక గ్లామర్ అభిమానులను అలరిస్తోందని అంటున్నారు. సినిమాకు రష్మిక గ్లామర్ ప్లస్ అయిందనే టాక్ వస్తోంది. ముఖ్యంగా.. మైండ్ బ్లాక్ సాంగ్ లో రష్మిక ఫుల్ జోష్ తో నటించిందని అంటున్నారు. పాటలో మాస్ స్టెప్పులతో యూత్ ని అలరిస్తోందని సమాచారం. మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేశ్రష్మిక పెయిర్ ఆకట్టుకుంటోదట. ఇద్దరూ మాస్ స్టెప్పులతో పాటను ఓ లెవల్ కు తీసుకెళ్లారని అంటున్నారు. మహేశ్ కంటే రష్మికకే ఈ పాటలో మార్కులు ఎక్కువ పడ్డాయని కూడా అంటారు.

 

 

రష్మిక ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఎప్పుడూ స్కిన్ షో చేయలేదు. మహేశ్ సినిమాలో మాత్రం గ్లామర్ ఒలకబోసింది. ఛలో నుంచి డియర్ కామ్రేడ్ వరకూ రష్మిక నటించిన సినిమాల్లో చాలా అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డియర్ కామ్రేడ్ లో మాత్రం విజయ్ దేవరకొండతో లిప్ లాక్ లు చేసి వార్తలో నిలిచింది. సినిమాలకు హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ అంతే ముఖ్యం. సినిమాకు గ్లామర్ తీసుకొచ్చేది ఆమె వల్లనే. మొత్తానికి రష్మిక తన అందచందాలతో అకట్టుకుందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: