మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో  సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కడలేని ఆసక్తి వస్తుంది. అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ నిర్మాత అశ్వినీదత్ వినాలని ఉంది అనే ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా ప్రకటన విడుదల కాగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.  కారణం ఇప్పుడు అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పదమైన సినిమాలు తీస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం... హీరోల ఫేట్  మార్చే  సినిమాలు తీస్తూ సంచలన విజయాలను నమోదు చేసేవారు. దీంతో రామ్ గోపాల్ వర్మ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా బాగా ఆసక్తి చూపేవారు. 

 

 

 అయితే చిరంజీవి హీరోగా రామ్గోపాల్ వర్మ  దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సినిమా కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ అదిరిపోయే కథ సిద్ధం చేసుకొని షూటింగ్ ప్రారంభించారు. అంతేకాదు ఈ సినిమా చిత్రీకరణ కొంత భాగం జరిగింది కూడా. రెండు పాటల చిత్రీకరణ కూడా జరిగిపోయింది. కానీ సడన్ గా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి వెనుక అసలు కారణాలు ఏంటి అని అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. చాలా రోజుల వరకు మెగా స్టార్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి అని చిత్ర పరిశ్రమలో చర్చ జరిగింది. రకరకాల ఊహాగానాలు కూడా వినిపించాయి అప్పట్లో. 

 

 

 అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో సినిమా కథ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి ఓ దశలో కొన్ని డౌట్స్ రావడంతో కథలో కొన్ని మార్పులు చేయాలి అంటూ సూచించారట. ఇంకేముంది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికి  తెలియనిది  కాదాయే.. అయితే కథ విషయంలో తాను అనుకున్నది అనుకున్నట్లు తీస్తా  తప్ప.. ఎవరు చెప్పినా వినను అని రామ్ గోపాల్ వర్మ రాజిపడకపోవడంతో ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. కాగా  మెగాస్టార్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ చిత్రీకరణ జరిగిన సినిమాలో టబు హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కోసం అంతకు ముందే కొన్ని పాటలు రాసిన మణిశర్మ ఆ పాటలను మెగాస్టార్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించిన చూడాలని ఉంది సినిమాలో వాడారు. ఇలా రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మూలకు పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: