సినిమాలు తీసే దర్శకులకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంపై పట్టు ఉంటే వారి నుంచి అనేక మంచి సినిమాలు వస్తాయి. వారిలోని ప్రతిభను, క్రియేటివిటీని బయటపెట్టటానికి వారికి సినిమాలు వేదికగా నిలుస్తాయి. ఓ విధంగా చెప్పాలంటే వారి ఐడియాలజీని ఆవిష్కరించుకోవటానికి సినిమానే సరైన వేదిక. తెలుగులో అటువంటి క్రియేటివిటీ సినిమాలు తీసే దర్శకులు అతికొద్దిమంది ఉన్నారు. అటువంటి వారిలో ముందువరుసలో ఉండే దర్శకుడు సుకుమార్. 15 ఏళ్ల ఆయన సినీ కెరీర్ లో సుకుమార్ తీసిన సినిమాలే ఆయనలోని క్రియేటివిటీని తెలియజేస్తాయి. నేడు ఆయన పుట్టినరోజు.

 

 

2018లో రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభమైంది. రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తోంది. ఇప్పటినే కేరళలోని మంచి మంచి లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. నేడు సుకుమార్ జన్మదినం సందర్భంగా మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమా మేకింగ్ స్టిల్స్ తో చిన్న వీడియో రూపొందించి యూట్యూబ్, ట్విట్టర్ లో రిలీజ్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

 

 

అందమైన వాటర్ ఫాల్స్ మధ్య సుక్కు చేస్తున్న షూటింగ్ విశేషాలతో కూడిన ఆ వీడియో చూడటానికి చక్కగా ఉంది. తన మార్క్ సినిమాలను పక్కనపెట్టి కమర్షియల్ గా తెరకెక్కించిన రంగస్థలం సంచలన విజయం సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో AA20 టెనిటివ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: