తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షోతోనే ఎంత మంది నటుల జీవితాన్ని మార్చేసింది. అంతేకాదు ఈ షోలో స్కిట్స్ చేసే వాళ్లు ఆ తర్వాత సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇలా జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు.  బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. వెండితెర‌పై కూడా క‌వ్విస్తున్నారు. ఇదిలా ఉంటే ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షో నుంచి రెండు నెలల ముందు తప్పుకున్నాడు నాగబాబు. ఆయనకు ఈటీవీలో ఉన్నపుడు ఎలాంటి టెన్షన్స్ లేవు.. జబర్దస్త్ టాప్ కామెడీ షో కావడం.. రేటింగ్స్ కూడా అదిరిపోవడంతో ఎలాంటి బాధలు లేకుండా ఉన్నాడు. అయితే జబర్దస్త్ నుంచి కొన్ని కారణాల వల్ల అదిరిందికి వచ్చాడు. ఈటీవీ నుంచి తన మకాం జీ తెలుగుకు మార్చాడు. 

 

ఇక్కడికి రావడానికి ఆయనకు బాగానే ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఈయ‌న వ‌స్తు వ‌స్తూనే . హైపర్ ఆదిని, సుడిగాలి సుధీర్ ని, చమ్మక్ చంద్రని, ఆర్సీని ఆఖరుకి యాంకర్ అనసూయని కూడా పక్క ఛానల్ కి పోదామని పిలిచాడు. కానీ చివ‌ర‌కు చమ్మక్ చంద్ర, ఆర్పీ లిద్దరూ నాగబాబుతో సహా అదిరింది ప్రోగ్రాంకి వెళ్లిపోయారు. దీంతో చంద్ర భారీ రెమ్యునరేషన్‌కు టెంప్ట్ అయ్యి జబర్దస్త్ ని వదిలేసాడనే టాక్ నడుస్తుంది. కానీ..  తాను నాగబాబు చెప్పడం వల్లే బయటికి వచ్చానని.. ఆయన వచ్చేస్తున్నపుడు మీరు కూడా వస్తే బాగుంటుందని అడిగాడని.. దాంతో ఓ సారి బయటికి కూడా అడుగేస్తే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు చంద్ర. 

 

ఇదిలా ఉంటే.. అదిరింది రేటింగ్స్ పరంగా మాత్రం ఏ మాత్రం అదరకపోగా.. నాగబాబు ఇమేజ్‌కు దెబ్బకొడుతుంది. అదే సమయంలో జబర్దస్త్ మాత్రం నాగబాబు వెళ్లిన తర్వాత కనీసం తొమ్మిది వరకు మెయింటేన్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే రెండు షోల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది. ఇప్పటి వరకు రేటింగ్స్ పెద్దగా రాకపోవడంతో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ షో నుంచి తప్పుకోవాలని నాగబాబు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదిరింది ఒక్కటే కాదు.. మొత్తానికే టీవీ నుంచి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి జనసేన పనులతో బిజీగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి నాగ‌బాబు వెళ్లిపోతే చంద్ర, ఆర్పీల ప‌రిస్థితి అయోమ‌యంలో ప‌డిన‌ట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: