సంక్రాంతి బరిలో పెద్ద హీరోలు రజినీకాంత్, మహేష్ బాబు, అల్లు అర్జున్, కళ్యాన్ రామ్ మూవీస్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ నెల 9న రజినీ నటించిన ‘దర్బార్’ మూవీ రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టాక్ రాలేదు.. కానీ తమిళనాట మంచి హిట్ టాక్ వచ్చింది.  ఈ రోజు అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రిలీజ్ అయ్యింది.  ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చిందని టాక్. రేపు త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘అల వైకుంఠపురములో’ మూవీ రిలీజ్ కాబోతుంది.  ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

ఒకవేళ ఈ మూవీ కి మంచి హిట్ టాక్ వస్తే మాత్రం మహేష్ బాబుకి కష్టాలు వచ్చినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. మ‌హేష్ సినిమా రిజ‌ల్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.. మాస్‌కు, క్లాస్‌కు ఎక్కేలా ఉంది. అల వైకుంఠపురములో మూవీ  క్లాస్ అన్న టాక్ ముందు నుంచి ఉంది. అయితేబ‌న్నీ, పూజ‌, త్రివిక్ర‌మ్‌, సాంగ్స్ హిట్ ప్ల‌స్‌లు కానున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సామజవరగమన, రాములో రాముల అనే పాటలు సూపర్ హిట్ అయ్యాయి.  ఇద్దరు టాప్ హీరోల మద్య పోటీ సామాన్యంగా ఉండదు.. ముఖ్యంగా ఫ్యాన్స్ విషయంలో ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

 

ప్రస్తుతం మహేష్ బాబు నటించి ‘సరిలేరు నీకెవ్వరు’ మంచి హిట్ కావాలన్నా.. కలెక్షన్లు భారీగా రాబట్టాలన్నా.. ‘అల వైకుంఠపురములో’ రిజల్ట్ ని బట్టే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ మద్య మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి రూ.150 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.  నివాస్ దర్శకత్వంలో బన్ని నటించిన ‘నాపేరు సూర్య’ డిజాస్టర్ తర్వాత బన్ని నటిస్తున్న మూవీపూ చాలా ఆశలు పెట్టుకున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: