బాలీవుడ్ లో ఒక మంచి నటుడుగా గుర్తింపు ఉన్న ఇర్ఫాన్ ఖాన్ తెలుగు వాళ్ళకి కూడా సైనికుడు లాంటి సినిమాల ద్వారా సుపరిచితుడే. నటన విషయం లో అతనికి ఎప్పుడూ మంచి మార్కులే పడ్డాయి. మహేశ్ తో సైనికుడు సినిమా లో కూడా నటన కి గాని మంచి ప్రశంసలు అందుకున్నారు .  ఇటీవ‌ల అరుదైన క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డిన ఆయ‌న చికిత్స కోసం లండ‌న్ వెళ్లి వ‌చ్చారు కూడా. ఇర్ఫాన్ ఖాన్ ఆ మధ్య తీసిన హిందీ మీడియం సినిమా అతిపెద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని సీక్వెల్ ఆంగ్రేజీ మీడియం సినిమా ని ఆయన చాలా ఇష్టంగా చేస్తున్నాడు .

 

 

సినిమా కి హోమీ అద‌జానియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాధికా మ‌ద‌న్‌, క‌రీనాక‌పూర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మార్చి 20న చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అనుకోకుండా ఆయన ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది .. న్యూరో ఎండోక్రైన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఇర్ఫాన్‌ఖాన్ తాజాగా ఆ వ్యాధి తిర‌గ‌దోడ‌టంతో అనారోగ్యానికి గుర‌య్యార‌ట‌. దీంతో ఆయ‌న షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

 

 

మళ్ళీ ఆయన వచ్చే వరకూ షూటింగ్ జరపడం కుదిరే పని కాదు . మళ్ళీ ఆయన సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి రావాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు . ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని ఇర్ఫాన్ ఖాన్ తాను మళ్ళీ పూర్తిగా ఆరోగ్యం గా తిరిగి వస్తే క్యాన్సర్ బాధితుల కోసం ఆసుపత్రి కట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఆయన వెనక్కి రావాలి అనీ మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవ్వాలి అనీ కోరుకుంటోంది బాలీవుడ్ మొత్తం .. మనం కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధిద్ధాము .. !

 

మరింత సమాచారం తెలుసుకోండి: