సరిలేరు నీకెవ్వరూ.. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి మహేష్ అభిమానుల మనోభావాలు దెబ్బ తీసింది.. సంచలనం సృష్టించింది. అదేంటి అనుకుంటున్నారా ? గత ఆరునెలల నుండి మహేష్ అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు ఈ సినిమా కోసం. కారణం.. ఈ సినిమాలో ఎంతో మంది స్టార్ యాక్టర్లు ఉన్నారు.           

 

 ఇంకా అసలు విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి అంతటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. సంక్రాంతి సందర్భంగా విడుదల అయినా ఈ సినిమా కొంతమంది నోట పాజిటివ్ టాక్ వినిపిస్తే మరికొందరి నోటి నుండి నెగటివ్ టాక్ వినిపిస్తుంది.                

 

ఇంకా ప్రత్యేకంగా ఈ సినిమాతోనే దాదాపు 13 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. నటన పరంగా అద్భుతంగా ఉన్న.. ఈ సినిమాకు ఆమె పాత్ర అవసరమా అనే ప్రశ్నలు ప్రేక్షకుల నుండి వస్తున్నాయి. అంతే కాదు.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన రావు రమేష్ పాత్ర కూడా సినిమాకు అంత అవసరమా అని ప్రశ్నలు వేస్తున్నారు. 

 

కాగా ఈ సినిమాలో చాల మైనెస్ పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటంటే ? పొడువు మహేష్ సరసన పొట్టి రష్మిక .. కెమిస్ట్రీ అస్సలు కుదరలేదు. ఓవర్ మేకప్ తో మహేష్ ని డామినెటే చెయ్యాలి అని చూసి ఆమె డామినెటే అయ్యింది. ఇంకా సంగీతం.. ప్రముఖ అద్భుత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సరే.. సినిమాలో పాటలు ప్రేక్షకులను అంత ఆకట్టుకోలేక పోయాయి. ఇలా అద్భుత నటి విజయశాంతి రీఏంట్రీ అవసరమా అనేలా అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: