సినిమా  క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురములో’  సినిమాకు సంబంధించిన అన్ని పనులు ముగిసిన వెంటనే ఈ చిత్ర సెట్స్‌లోకి బన్ని అడుగుపెట్టనున్నారు. ఇక  ఈ చిత్రానికి ఇప్పటికే సంబంధించి స్టోరీ, బన్ని క్యారెక్టర్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో చాలానే ప్రచారం జరుగుతోంది.

 

 దీంతో ఈ చిత్రంపై సినీ అభిమానులు  ఓ రకమైన ఎగ్జైట్‌మెంట్‌ను కనబరుస్తున్నారు. తాజాగా డైరెక్టర్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ అందరికి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇది అల్లు అర్జున్‌కు ఈ సినిమా 20 చిత్రం కావడంతో ఓ చిన్న వీడియోను ‘ఏఏ20’అనే వర్కింగ్‌ టైటిల్‌ పేరుతో  అభిమానులకు కానుకగా అందించింది.  ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

 

 తాజాగా విడుదల చేసిన మేకింగ్‌ వీడియో ప్రకారం ప్రస్తుతం షూటింగ్‌ కేరళ అడవుల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వీడియోలో కనిపిస్తున్న భారీ జలపాతల నడుమ హీరోతో భారీ సీన్లకు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తునట్లు సమాచారం. ఈ సినిమాలో  బాహుబలిలో ప్రభాస్‌ ఎంట్రీ సీన్‌కు మించి బన్ని ఇంట్రడక్షన్‌ ఉంటుందని లీకువీరుల సమాచారం. 


‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన బన్ని.. ఆ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్‌ చేయడానికి  వరుస సినిమాలతో అభిమానులను అలరించనున్నాడు. సుకుమార్‌ సినిమా తర్వాత మురగదాస్‌, వేణు శ్రీరామ్‌, కొరటాల శివలతో అల్లు అర్జున్‌ సినిమాలు ఉండబోతున్నట్లు బన్నీ అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్‌ ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి ఈవిధంగా పేర్కొన్నాడు.  ఇక సుకుమార్‌-బన్ని కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా అదిరిపోయే దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రానికి రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: