అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో జూలై, సన్నాఫ్ సత్యమూర్తి హిట్ సినిమాలు రావడంతో మూడో సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలన్నీ ఉర్రూతలూగించాయి ప్రస్తుతం అలా వైకుంఠపురం పాట అందరి నోటా వినిపిస్తుంది. ఇక యువత అయితే అలా వైకుంఠపురములో పాటలతో హోరెత్తిపోతున్నారు. ఈ పాటలు యూట్యూబ్ లో రికార్డులు సైతం సృష్టించాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త లుక్తో అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే గతంలో అల వైకుంఠపురములో మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్ లో మాట్లాడిన హీరో అల్లుఅర్జున్ మెగా ఫ్యామిలీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు... రెండు మాటలు మాట్లాడితే సరిపోతుంది అని చెబుతున్నారు... నేను నిజంగా చెబుతున్నాను నా పెద్ద మావయ్య అంటే ఎంతో ఇష్టమని కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానిని అంటూ సభ వేదికగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మెగా పవన్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసాయి. దీంతో అటు మెగా ఫాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ పై కాస్త గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కరుణిస్తాడా లేదా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మారింది.
ఎందుకంటే అల వైకుంఠపురం సినిమాలో మెగా ఫ్యాన్స్ కరుణిస్తేనే సినిమా భారీ హిట్ అవుతుంది అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మెగా ఫాన్స్ కరుణించటంలో ఎక్కడ తేడా వచ్చినా ఎఫెక్ట్ మొత్తం వసూళ్లతో పాటు సినిమాపై కూడా పడుతుంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ టార్గెట్ చేయాలని మెగా ఫాన్స్ తో పవన్ ఫ్యాన్స్ కూడా చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ పవన్ ఫాన్స్ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమా అవాయిడ్ చేయడం సహా ఒకవేళ సినిమాకి ఆవరేజ్ టాక్ వచ్చిందంటే అల్లు అర్జున్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరడం ఖాయం అనిపిస్తుంది. ఒకవేళ మెగా ఫాన్స్ అవాయిడ్ చేసినప్పటికీ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు రాబట్టి అవకాశం ఉంది. కాగా రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చూడాలి మరి .