సంక్రాంతి బ‌రిలో ఉన్న మ‌రో చిత్రం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన `అల‌వైకుంఠ‌పురంలో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో పూజాహెగ్డే, బ‌న్నీ జంట‌గా న‌టిస్తున్నారు. ఒక ఇప్ప‌టికే విడుద‌లైన సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ `ద‌ర్బార్‌`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`చిత్రాలు హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు ఫుల్ క్రేజ్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో న‌డుస్తోంది. రేపు విడుద‌ల‌వుతున్న బ‌న్నీ `అల‌వైకుంఠ‌పురంలో` చిత్రం పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి.   

 


‘అల వైకుంఠపురములో’ సినిమా ఫలితం పై హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.  ఒక మంచి సినిమాను తెరకెక్కించామని, ఇది కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని వారు అంటున్నారు. పాటలు, ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ అంచనాలకు ఎక్కడా తక్కువ కాకుండా సినిమా ఉంటుందని అర్థమైపోయింది. 

 


దీని పై ప్రముఖ సినీ విమర్శకుడు శివ సత్యం ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. నిన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన ముంబైకి చెందిన సినీ విమర్శకుడు శివ సత్యం.. ఈరోజు ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి కూడా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’కి ఇచ్చినట్టే దీనికి కూడా 3.5 రేటింగ్ ఇచ్చారు. అయితే, ఈ సినిమాలో బన్నీ అంతా తానై నడిపించారని, తన భుజస్కందాల పై మోశారని ట్వీట్ చేశారు శివ సత్యం. సినిమాలో చాలా మెరిట్స్ ఉన్నాయని.. కచ్చితంగా ఎక్కవ మంది ఆడియన్స్‌కి ఈ సినిమా రీచ్ అవుతుందని పేర్కొన్నారు.

 


సినిమాకు ఓవరాల్‌గా మంచి రేటింగ్ 3.5  ఇచ్చిన శివ సత్యం.. చిత్రంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ రేటింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్‌కి 4 రేటింగ్ ఇచ్చారు. ఇంకా టెక్నిక‌ల్ వ్యాల్యూస్ అదుర్స్ అని తెలిపారు.   త్రివిక్రమ్ దర్శకత్వానికి మంచి ప్ర‌శంస‌లు అందించారు. స్క్రీన్‌ప్లే కూడా అదిరిపోతుంది. ఇంకా మిగిలిన యాక్ట‌ర్స్ అంద‌రికీ చాలా మంచి పేరే వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘అల వైకుంఠపురములో’ స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి దాటిన తరవాత నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: