సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్  ప్రస్తుతం థియేటర్లలో  సందడి చేస్తుంది. మొన్న విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకున్నా  రజినీ మ్యాజిక్ తో  బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తుంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం తమిళ్ , తెలుగులో  కలిపి ప్రపంచ వ్యాప్తంగా  100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  అయితే  పైరసీ రూపంలో నిర్మాతలకు భారీ దెబ్బ పడింది. 
 
 విడుదలైన  మొదటి రోజే ఈ చిత్రాన్ని తమిళ్ రాకర్స్ పైరసీ చేయగా తాజాగా  ఓ వ్వక్తి  సినిమా మొత్తాన్ని పైరసీ చేసి  వాట్సప్ లో షేర్ చేశాడు.  అలా  షేర్  అవుతూ ఆపైరసీ ప్రింట్ కొన్ని వేల మందికి  చేరింది. దాంతో ఖంగుతిన్న చిత్ర నిర్మాణ సంస్థ  లైకా ప్రొడక్షన్స్ ,సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో  కంప్లైంట్ చేసింది.  భారీ బడ్జెట్ తో మేము నిర్మించిన దర్బార్  మొన్న విడుదలకాగా సినిమా ను పైరసీ చేసి  వాట్సప్ గ్రూప్ ల్లో షేర్  చేస్తున్నారు. అలా కొన్ని వేల మందికి   ఈపైరసీ కాపీ చేరింది. దాంతో సినిమా చూడడానికి  జనాలు థియేటర్లకు రావడం లేదు దాని వల్ల  కలెక్షన్స్  కు తీవ్ర నష్టం ఏర్పడుతుంది. 
 
వీలైనంత తొందరగా దీనికి కారణమైన  వ్యక్తిని పట్టుకొని అతని పై చర్యలు తీసుకోవాలని ఆ కంప్లైంట్ లో పేర్కొంది.  ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇక కోలీవుడ్ లో ఈ సినిమా కు ఎదురులేకపోవడంతో మూడో రోజు కూడా అక్కడ భారీవసూళ్లను రాబట్టుకుంది. అయితే తెలుగులో మాత్రం  భారీ దెబ్బ పడింది. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన  సరిలేరు నీకెవ్వరు విడుదలకావడంతో  దర్బార్ ను చాలా థియేటర్లలో  లేపేశారు. దానికి తోడు  అందరు ఆ సినిమా పై ఆసక్తి చూపించడం తో  దర్బార్  ను ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: