టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ నిర్మాణ సంస్థలైన  గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాజా సినిమా అల వైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూర్చగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందించడం జరిగింది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ కు యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ మరియు లైక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలానే థియేట్రికల్ ట్రైలర్ కూడా మంచి సక్సెస్ సాధించి సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. ఇక నేడు ఎన్నో అంచనాలు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

 

ముందుగా ఫస్టాఫ్ మొత్తం కొంత ఎంటర్టైనింగ్ గా సాగుతూ అక్కడ అక్కడ బన్నీ పలికే డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అని తెలుస్తోంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుందని, దానితో సెకండాఫ్ పై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇక ఒకింత మెల్లగా సాగే సెకండాఫ్ మధ్యలో వచ్చే కొన్ని యాక్షన్ ఎమోషనల్ అలానే ఎంటర్టైనింగ్ సీన్స్ కలబోతగా ముందుకు సాగుతుందట. ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే చాలా బాగుందని, అనంతరం వచ్చే క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు. 

 

మధ్యలో కొన్ని ల్యాగ్స్ తో పాటు సాగతీతగా ఉండే సీన్స్ ప్రేక్షకుడి సహనానికి కొంత పరీక్ష పెడతాయని, దానితోపాటు సినిమా చాలావరకు త్రివిక్రమ్ గత సినిమాలను కొంతవరకు గుర్తుచేస్తుందని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, సాంగ్స్, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని, ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా యావరేజ్ గా నిలిచే అవకాశం ఉందని మెజార్టీ ప్రేక్షకులుఅభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ఒకరకంగా దీన్ని బట్టి చూస్తుంటే గతంలో త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల రేంజ్ ని ఈ సినిమా అందుకునే అవకాశం చాలావరకు లేనట్టు, అలానే ప్రేక్షకులు కూడా ఇదేంటి త్రివిక్రమా ఇలా చేసావు అనేలా ఈ సినిమా ఉందని చెప్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఏ విధమైన టాక్ తో అలానే ఏ రేంజ్ లో కలెక్షన్లతో దూసుకుపోతుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: