తెలుగు సినిమా అనే కాకుండా ఏ సినిమాకైనా సంగీతం చాలా ముఖ్యం. పాటలు ఎంత బాగా వస్తే సినిమాపై అంచనాలు అంత ఎక్కువగా ఉంటాయి. సినిమా కథకు, నేపథ్యానికి అనుగుణంగా సంగీతం అందించడం కొందరు సంగీత దర్శకులలకు కొట్టిన పిండి అయితే.. హీరోను బట్టి ప్రేక్షకులకు ఏ పాటలు ఇస్తే సక్సెస్ అవుతాయో తెలిసిన సంగీత దర్శకులు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తి టాలీవుడ్ సంగీత సంచలనం దేవీశ్రీ ప్రసాద్. రాక్ స్టార్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను అందించాడు దేవీ.

 

 

అలాంటి దేవిశ్రీ ప్రసాద్ కు ప్రస్తుతం టైమ్ ఏమాత్రం బాగోలేదని రీసెంట్ సినిమాలకు అతను అందించిన పాటలను బట్టి చెప్పొచ్చు. ముఖ్యంగా ఈమధ్య సూపర్ స్టార్ మహేశ్ తో వరుసగా సినిమాలు చేశాడు దేవీ. ఇందులో శ్రీమంతుడు మినహా.. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు దేవీ అందించిన సంగీతం చాలా పేలవంగా ఉందని మహేశ్ ఫ్యాన్సే నిరాసక్తత వ్యక్తం చేశారు. గత రెండు సినిమాల పాటలు మహేశ్ సినిమాల్లోనే ఏ సినిమాలోనివో చెప్పడం కష్టంగా ఉంది అనే విమర్శలు వచ్చాయి. సరిలేరు.. కు కూడా దేవీనే మహేశ్ సెలక్ట్ చేసినప్పుడు ఆయన ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది.

 

 

సరిలేరు పాటల విషయంలో మహేశ్ అభిమానుల భయమే నిజమైంది. పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. సినిమాకు ఏమాత్రం ప్లస్ కాలేకపోయాయి. ప్రస్తుతం దేవీశ్రీ చేస్తున్న పెద్ద సినిమా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న అల్లు అర్జున్ మూవీ. మరి ఈ సినిమా దేవీకి పరీక్షగా నిలవబోతోంది. ఈ సినిమాతో అయినా దేవీ బౌన్స్ బ్యాక్ అవుతాడని.. సుకుమార్ తో కాంబో అలాంటిదని అంటున్నారు. ఈ నేపథ్యంలో దేవీశ్రీ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: