ప్రముఖ హస్య నటుడు, ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అంటే తెలియని వారుండరు. ఒక చిన్న ఆర్టిస్ట్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన పృథ్వీ తన టైమింగ్ కామేడీతో ప్రేక్షకుల్ని నవ్వించడంలో ఆరితేరాడు. ఇక ఇతని అసలు పేరు బలిరెడ్డి పృధ్వీరాజ్.. ఇక ఇతను ఎక్కువగా హాస్య పాత్రలతో పాటుగా, కొన్ని ప్రతినాయక పాత్రలు కూడా పోషించాడు.

 

 

ఇక పృథ్వీ ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో 1993లో మొదటి సారిగా నటించాడు. ఆ తర్వాత కృష్ణవంశీ, ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో హాస్యనటుడిగా మంచి ప్రాచుర్యం పొందాడు. ఇదే కాకుండా గోపీచంద్ హీరోగా వచ్చిన లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర కూడా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చూ.  అంతే కాకుండా పోకిరి, ఢీ, రెడీ, కిక్, దూకుడు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో మంచి పేరున్న పాత్రలు లభించడంతో అతనికి స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు లభించింది.

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వివాదస్పద వాఖ్యల్లో నిలుస్తున్నాడు. రాజకీయాల్లో చేరాక ఇతనిపై ఆ దుమారం మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు 30  పృథ్వీ.. అదేమంటే ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయట. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల టేప్‌ను కూడా 99 ఛానల్ ప్రసారం చేసిందట. దీనిపై ఇప్పుడు పెను దుమారం చెలరేగుతుంది.

 

 

అయితే 99టీవీ ఛానల్ ప్రసారం చేసిన ఆడియో టేప్‌లో ఈ సమాచారం ఉండగా. ఈ ఆడియో టేప్ గురించి మరో తెలుగు న్యూస్‌ చానల్ ఎస్వీబీసీ చైర్మన్‌ను సంప్రదించి, దీనిపై వివరణ కోరగా ‘నన్ను భ్రష్టుపట్టించడానికి’ అని సమాధానం ఇచ్చారట. దానికి ప్రతిగా ఈ ఆడియో నకిలీది అని మీరు చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నించగా ‘ఔను’ అని సమాధానం ఇచ్చారట 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ఇకపోతే ఇందులో నిజానిజాలు ఆ భగవంతునికి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ఈ విషయం ఒక చర్చగా మారిందని అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: