టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురములో.. ఈ  సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలుగజేసింది.. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలన్ని  సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఎక్కడ  చూసిన ఎవ్వరినోట చూసిన అల వైకుంఠపురములో పాట  వినిపిస్తోంది. అయితే ప్రేక్షకులల్లో భారీ  అంచనాలు పెంచేసిన  ఈ సినిమా చివరికి నేడు  విడుదలై   ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ప్రేక్షకుల  అందరి అంచనాలను శాటిస్ఫై చేస్తుంది ఈ సినిమా. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ అల  వైకుంఠపురములో  సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అనిపిస్తుంది. 

 

 

 ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలూ వచ్చి  అదిరిపోయే విజయాలను సొంతం చేసుకున్నాయి. అల వైకుంఠపురములో  కూడా ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. త్రివిక్రమ్ మరోసారి అల వైకుంఠపురములో  సినిమాతో మాటల మాంత్రికుడు అని నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో అన్ని పాత్రలను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరోసారి హిట్  కాంబినేషన్ అని నిరూపించుకున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన టబు  కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. 

 

 

 ఇక ఈ సినిమాలో టబు  చెప్పిన ఓ  డైలాగ్ ప్రస్తుతం హిస్టరీ లో మిగిలి పోయేలా ఉంది. మాటల మాంత్రికుడు రాసిన డైలాగ్ ని టబు  చెప్పేసరికి ఆ డైలాగ్  మరింత గుర్తుండి పోయేలా మారిపోయింది. ఈ సినిమాలో టబు కొడుకు సుశాంత్.. అసలు కొడుకు బన్నీ కానీ ఆ విషయం టబుకి తెలియదు... అయితే తన కొడుకు సుశాంత్ ను  కాపాడడానికి వెళ్తాడు బన్ని . అయితే తన కొడుకును కాపాడిన బన్నీతో డైలాగ్ చెబుతోంది టబు . ఆడవాళ్లు బయటనుంచి వచ్చిన అబ్బాయిని  భర్తగా అంగీకరిస్తారు... అయితే తన నుంచి రాని వాడిని బిడ్డగా ఒప్పుకోరు అని టబు  చెబుతుంది.టబు  చెప్పిన ఈ డైలాగ్ సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరి మనసును తాకింది. నిజంగా టబు  చెప్పిన ఈ డైలాగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులపాటు గుర్తుండిపోయే డైలాగే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: