బన్నీ త్రివిక్రమ్ కాంబిఏషన్లో ముడవ చిత్రం గా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. థమన ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని సమకుర్చారు.
అయితే ఈ సినిమా చేయడానికి ముందు బన్నీ తన తర్వాతి ఏ సినిమా చేయాలా అని చాలా ఆలోచించాడట. దానికి కారణం అంతకుముందు వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ కావడమే. ఎన్నోఅంచనాల మీద వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో బన్నీ కెరీర్లో ఏడాది గ్యాప్ వచ్చింది. ఈ ఏడాదిలో ఆయన ఎన్నో కథలని విన్నాడు. కానీ ఏదీ కూడా సంతృప్తిని ఇవ్వలేదట.
అలాగే బాలీవుడ్ మువీని కూడా రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. బాలీవుడ్లో హిట్టయిన సోనూ కీ టిటు కీ స్వీటీని రీమేక్ చేయాలని బన్నీ-త్రివిక్రమ్ అనుకుంటున్నట్లుగా గట్టి ప్రచారమే జరిగింది అప్పట్లో. ఐతే అది జస్ట్ రూమర్ కాదని.. నిజంగానే ఆ ప్రతిపాదనపై కొంత చర్చ నడిచిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బన్నీ వెల్లడించడం విశేషం. సోను కి టిటీ కీ స్వీటీ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాగా చేయాలని అనుకున్నారట.
కానీ అప్పటికే త్రివిక్రమ్ కథ రెడీ చేయడంతో ఆ కథ ఆ సినిమా కన్నా బాగా నచ్చడంతో త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకే రెడీ అయ్యాడట. సోను కీ టిటీకీ స్వీటీ సినిమా బాలీవుడ్ లో రిలీజై వందకోట్లకి పైగా వసూళ్ళని సాధించింది.