బన్నీ కి మళయాలంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక తెలుగు హీరోకి మళయాలంలో ఇంతటి క్రేజ్ రావడం నిజంగా ఆశ్చర్యమే. తెలుగుతో సమానంగా మళయాలంలో అభిమానులని సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. బన్నీ కేరళ వెళ్ళినప్పుడల్లా ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈ అభిమానుల కోసం బన్నీ మళయాలంలో డైరెక్ట్ గా సినిమా చేసే పనిలో ఉన్నాడట.

 

 

 

 

సాధారణంగా పరభాషా నటుల సినిమాలు తెలుగులో విడుదల అయినపుడు ఖచ్చితంగా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తారని చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ ఏదో మొక్కుబడిగా మాత్రమే ఉంటాయి. కేవలం మాటల వరకే పరిమితం చేస్తారు. అయితే బన్నీ తన మాటలని నిజం చేయాలని అనుకుంటున్నాడట. మళయాలీల కోసం నిజంగానే సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఈ మేరకు చాలా సీరియస్ గా ఉన్నాడని సమాచారం.

 

 

 

మలయాళంలో సినిమా చేయడం కోసం సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు బన్నీ వెల్లడించాడు. అక్కడ సినిమా చేయడంపై తాను చాలా సీరియస్‌గా ఉన్నానని.. ఇప్పటికే అక్కడి దర్శకులు తనకు కొన్ని కథలు కూడా చెప్పారని.. కానీ అవి నచ్చక ఊరుకున్నానని బన్నీ తెలిపాడు. మరి కొద్ది రోజుల్లో తనకి సరిపడా స్క్రిప్టు దొరికితే ఖచ్చితంగా మళయాలీ అభిమానుల కోసం సినిమా చేస్తానని అంటున్నాడు.

 

 

 

మరి మళయాలీలు మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకునే బన్నీ డైరెక్ట్ గా మళయాలంలో సినిమా చేస్తే ఆ అభిమానులకి పండగే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో సినిమా మళయాలంలో 'అంగు వైకుంఠపురత్తు' పేరుతో రిలీజవుతోంది. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకే రోజు విడుదల అవుతున్న ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులకి నచ్చుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: